News July 7, 2025
నిర్మల్: పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత: కలెక్టర్

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. ఆమె నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో పలు రకాల మొక్కలను నాటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని ఆమె అన్నారు. “వనం ఉత్సవాలలో” భాగంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అందరూ మొక్కలు నాటాలని కోరారు.
Similar News
News July 8, 2025
దాల్చిన చెక్క నీళ్లతో ఎన్ని లాభాలంటే?

దాల్చిన చెక్క నీటిని ఉదయాన్నే తాగితే మంచి లాభాలుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒక కప్పు నీటిలో ఒక దాల్చిన చెక్క ముక్క వేసి 15-20 నిమిషాలు మరిగించాలి. ఆ నీటిని గోరు వెచ్చగా తాగాలి. అది జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఆర్థరైటిస్ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
News July 8, 2025
అడ్వాన్స్డ్ ఫీచర్లతో GROK 4.. జులై 8న రిలీజ్

xAI ఆవిష్కరించిన AI చాట్ బాట్ GROKలో కొత్త వర్షన్ రాబోతోంది. GROK 4 కొత్త రిలీజ్ డేట్ను ఎలాన్ మస్క్ ప్రకటించారు. జులై 4న జరగాల్సిన ఈ రిలీజ్ బుధవారం(జులై9)కి వాయిదా పడింది. రా.8 గంటలకు రిలీజ్ లైవ్ స్ట్రీమ్ ఉంటుందని మస్క్ ట్వీట్ చేశారు. ఇది ఓ స్పెషలైజ్డ్ కోడింగ్ మోడల్. డెవలపర్స్ కోసం కోడింగ్ ఆటో కంప్లీషన్, డీబగ్గింగ్, IDE ఇంటిగ్రేషన్ ఉంటుంది. రియల్టైమ్ డేటా, మల్టీ మోడల్ సపోర్టింగ్ కూడా ఉంటుంది.
News July 8, 2025
ఈ-ఆరోగ్యం నమోదులో కామారెడ్డి జిల్లాకు అగ్రస్థానం

కామారెడ్డి జిల్లా ఈ-ఆరోగ్యం ఆన్లైన్ అప్లికేషన్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లాలోని 22 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 25,152 మంది చికిత్స పొందగా, 23,723 మంది డాక్టర్లను సంప్రదించారు. 5,232 మంది రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 21,539 మంది ఔషధ సేవలు పొందారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, DMHO చంద్రశేఖర్ ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.