News July 7, 2025

NRPT: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలి

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. మొత్తం 30 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

ఇల్లందు నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరికి RTC బస్సులు

image

ఇల్లందు నుంచి యాదగిరిగుట్ట, స్వర్ణగిరి ఆలయాల దైవ దర్శనాల కోసం ప్రత్యేకంగా RTC డీలక్స్ బస్సులను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం RTC RM సరిరామ్ తెలిపారు. జులై 13న ఉదయం 5 గంటలకు ఇల్లందు బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ.840, పిల్లలకు రూ.440 నిర్ణయించామని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 91364 46666, 98661 59829 నంబర్లను సంప్రదించాలన్నారు.

News July 8, 2025

‘అల్లూరి జిల్లాలో 2500 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం’

image

వనం – మనం కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో 2500 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని డ్వామా PD. విద్యా సాగర్ సోమవారం తెలిపారు. పాడేరు, చింతపల్లి డివిజన్‌లలో సిల్వర్ ఓక్ మొక్కలను, రంపచోడవరం, చింతూరు డివిజన్‌లలో పండ్లు జాతి మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా 22 మండలాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడించారు.

News July 8, 2025

VZM: ‘బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియ పూర్తి చేయండి’

image

P4 కార్య‌క్ర‌మంలో భాగంగా వెంట‌నే మార్గ‌ద‌ర్శుల‌ను గుర్తించే ప్ర‌క్రియ‌ను మొదలుపెట్టాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. జిల్లా అధికారులు, ఆర్‌డివోలు, నియోజ‌క‌వ‌ర్గ స్పెష‌ల్ ఆఫీస‌ర్లతో సోమ‌వారం క‌లెక్ట‌ర్ త‌మ ఛాంబ‌ర్ నుంచి వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. జిల్లా వ్యాప్తంగా 67,066 బంగారు కుటుంబాల‌ను గుర్తించామని, వారి ద‌త్త‌త ప్ర‌క్రియ ఈ నెలాఖ‌రుకు పూర్తి చేయాలన్నారు.