News July 7, 2025
JNTU: రేపటితో ముగియనున్న మొదటి విడత కౌన్సెలింగ్

TG EAPCET ప్రవేశాలకు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో కొనసాగుతున్న మొదటి దశ కౌన్సిలింగ్ పక్రియ రేపటితో ముగియనుంది. ఇప్పటికే కౌన్సెలింగ్ పూర్తయిన విద్యార్థులకు వెబ్ ఆప్షన్ల నమోదు పక్రియ ప్రారంభించారు. ఇలా పదో తేదీ వరకు విద్యార్థులు వారికి నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 171 ఇంజినీరింగ్ కళాశాలలో 1,07,218 సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి అధికారులు తీసుకొనివచ్చారు.
Similar News
News July 8, 2025
భీమ్గల్: 5 నెలల చిన్నారిని హత్య చేసిన తల్లి..?

భీమ్గల్ మండలంలో దారుణం జరిగింది. కడుపులో దాచుకోవాల్సిన తల్లి బిడ్డను కడతేర్చింది. తన కూతురిని భార్యే హత్య చేసిందని భర్త ఫిర్యాదు చేసినట్లు SI సందీప్ తెలిపారు. గోనుగొప్పుల వాసి మల్లేశ్- రమ్య దంపతులకు శివాని(5) సంతానం. రమ్య తాగుడుకు బానిసై చిన్నారిని పట్టించుకోవడం లేదు. దీంతో మల్లేశ్ భార్యను పలు మార్లు మందలించాడు. బిడ్డ కారణంగానే గొడవలు జరుగుతున్నాయని భావించిన రమ్య ఈనెల 6న హత్య చేసిందన్నారు.
News July 8, 2025
MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కుసుమ కుమార్

స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇన్ఛార్జ్లను నియమించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్గా కుసుమ కుమార్ను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈయన గతంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. పలు రాష్ట్రాల్లో పార్టీ నుంచి ఎన్నికల ఇన్ఛార్జ్గా బాధ్యతలు నిర్వహించారు.
News July 8, 2025
UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.