News July 7, 2025

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలను క్షుణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పీజీఆర్‌యస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ స్వీకరించారు. 394 ఫిర్యాదులు అందాయి అన్నారు. కార్యక్రమంలో జాయింటు కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 8, 2025

UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

image

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.

News July 8, 2025

వేధింపులకు గురిచేయడం వలనే ఆత్మహత్య చేసుకుంది: ఎస్సై

image

కొయ్యూరు మండలం రావణాపల్లిలో మౌనిక అనే వివాహిత తన కుమార్తె లాస్యశ్రీ(5)తో కలిసి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. సతీశ్ కుమార్‌ను మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. సతీశ్ మద్యం తాగి ఇంటికి రావడం, అనుమానించడం, వేధింపులకు గురి చేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.

News July 8, 2025

రేపు పార్వతీపురంలో జాబ్ మేళా

image

పార్వతీపురంలో రేపు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఊపాధి కల్పన అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా పార్వతీపురం జూనియర్ కళాశాలలో జరుగుతుందని, వివిధ ఫార్మా సంస్థలు 85 ఖాళీలను భర్తీ చేస్తాయని ఆమె చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.