News July 7, 2025
మహిళలు శక్తిమంతులు: సిద్దిపేట కలెక్టర్

మహిళలు శక్తిమంతులని, వారి పనికి వెలకట్టలేమని, వర్తక, వ్యాపార రంగంలోనూ ముందుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులో జిల్లా మహిళా సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు అనే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముందుగా సమాఖ్య భవనం ఆవరణలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ మొక్కలు నాటారు.
Similar News
News July 8, 2025
ఉంగుటూరు: వ్యక్తిపై తలపై కత్తితో దాడి.. ఆసుపత్రికి తరలింపు

ఓ వ్యక్తి మరోకరి తలపై కత్తితో దాడి చేసి గాయపరిచిన సంఘటన సోమవారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సింగరాజు పాలెం గ్రామానికి చెందిన వ్యక్తి అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తిని ఉంగుటూరు ఎర్ర చెరువు వద్ద దాడి చేశారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనా ప్రదేశానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని కారులో తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు.
News July 8, 2025
అర్ధరాత్రి ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి

ఉరవకొండ మం. బూదగవి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు రోడ్డు పక్కన పడటంతో చాలాసేపటి వరకు ఎవరూ గుర్తించలేదు. అటుగా వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడిన ఒకరిని 108లో ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 8, 2025
ప్రకాశం: అద్దెకు ఇళ్లు.. చివరికి బెదిరింపులు

తన ఇంట్లో అద్దెకు ఉంటూ అద్దె చెల్లించకపోగా ఇంటి యజమానిని బెదిరిస్తున్న వైనంపై సదరు బాధితురాలు సోమవారం SP దామోదర్కు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఓ మహిళకు ఒంగోలులో నివాసం ఉంది. ఆ నివాసాన్ని అద్దెకు ఇచ్చారు. వారు అద్దె డబ్బులు చెల్లించకుండా, ఖాళీ చేయకుండా తనను బెదిరిస్తున్నట్లు సదరు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.