News July 7, 2025

నంద్యాల: గ్రీవెన్స్ డేకు 75 ఫిర్యాదులు

image

బొమ్మలసత్రం వద్ద ఉన్న నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సోమవారం జరిగింది. ప్రజల నుంచి 75 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. వీటిపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు.

Similar News

News July 8, 2025

MBNR: స్థానిక సంస్థల ఎన్నికలు.. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కుసుమ కుమార్

image

స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఛార్జ్‌లను నియమించింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్‌ఛార్జ్‌‌గా కుసుమ కుమార్‌ను నియమిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఈయన గతంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, జాతీయస్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. పలు రాష్ట్రాల్లో పార్టీ నుంచి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించారు.

News July 8, 2025

UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

image

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.

News July 8, 2025

వేధింపులకు గురిచేయడం వలనే ఆత్మహత్య చేసుకుంది: ఎస్సై

image

కొయ్యూరు మండలం రావణాపల్లిలో మౌనిక అనే వివాహిత తన కుమార్తె లాస్యశ్రీ(5)తో కలిసి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. సతీశ్ కుమార్‌ను మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. సతీశ్ మద్యం తాగి ఇంటికి రావడం, అనుమానించడం, వేధింపులకు గురి చేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.