News July 7, 2025

ఈ లక్షణాలను వెంటనే విడిచిపెట్టేయ్ మిత్రమా!

image

ప్రతి విషయానికీ ఎక్కువగా ఆలోచించే ఓ మిత్రమా.. ఇది నీకోసమే. నువ్వు మొదటగా ఈ 5 లక్షణాలను విడిచిపెడితే నీ ఆలోచనా విధానం పూర్తిగా మారిపోతుంది. తొలుత అందరినీ సంతృప్తి పరచాలని అనుకోకు. జరిగినవి, జరగబోయే విషయాలపై అనవసరంగా ఆందోళన చెందకు. ముందుగా నిన్ను నువ్వు కించ పరుచుకోవడం మానేసేయ్. మార్పులకు భయపడకుండా ధైర్యంగా నిలబడు. గతాన్ని వదిలేసి భవిష్యత్తుపై దృష్టి పెట్టు. SHARE IT

Similar News

News July 8, 2025

జనగణన.. పౌరులే వివరాలు సమర్పించే అవకాశం

image

దేశ వ్యాప్తంగా చేపట్టే జన, కులగణనలో పౌరులే నేరుగా తమ వివరాలు సమర్పించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా కల్పించనుంది. ఇందుకోసం త్వరలోనే ఓ వెబ్‌సైటును అందుబాటులోకి తీసుకురానుంది. తొలుత 2026 ఏప్రిల్ 1న ఇళ్ల వివరాలతో కూడిన జాబితా, ఆ తర్వాత 2027 ఫిబ్రవరి 1 నుంచి జనగణనను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. ఇదే సమయంలో కులగణననూ చేపడతారు. ఈ రెండు విడతల్లోనూ ప్రజలు తమ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయవచ్చు.

News July 8, 2025

నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

image

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.

News July 8, 2025

తోడు కోసం పెళ్లి చేసుకుంటే రూ.28 కోట్లతో జంప్!

image

AP: చిత్తూరు(D) రాజుపేటకు చెందిన నాగమణి (50) గతంలో భర్త, కుమారుడిని కోల్పోయారు. శేష జీవితంలో తోడు కోసం పెళ్లి బ్రోకర్ ద్వారా ప్రకటన ఇచ్చారు. శేషాపురానికి చెందిన శివప్రసాద్‌(40) కరోనాతో తన భార్య చనిపోయిందని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. బెంగళూరులో నాగమణికి చెందిన రూ.10 కోట్ల విలువైన భూమి, రూ.15 కోట్ల అపార్ట్‌మెంట్ విక్రయించడంతో పాటు రూ.3 కోట్లు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీసులను ఆశ్రయించారు.