News July 7, 2025
JGTL: కోరుట్ల నుంచి అరుణాచలానికి SPECIAL బస్సు

పౌర్ణమి సందర్భంగా కోరుట్ల నుంచి తిరువన్నమలై(అరుణాచలం)కి కోరుట్ల డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ మనోహర్ తెలిపారు. రేపు బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తరువాత రాత్రికి అరుణాచలానికి చేరుకుంటుంది. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో జోగులాంబ ఆలయ దర్శనం ఉంటుందని, పెద్దలకు రూ.5,000, పిల్లలకు రూ.3,800ల టికెట్ ధర నిర్ణయించామని తెలిపారు.
Similar News
News July 8, 2025
GNT: ‘మాజీ ఎంపీ అనుచరుడి నుంచి ప్రాణరక్షణ కల్పించండి’

లాలాపేటకు చెందిన ముజబుర్ రహమాన్, తన సోదరుడికి ప్రాణరక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరుడు సన్నీ, ఇసుక క్వారీ నిర్వహణకు రూ.25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బీహార్ గ్యాంగ్తో చంపిస్తానని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. ఈ విషయమై తన సోదరుడు గతంలో ఆత్మహత్యాయత్నం చేశారని పేర్కొన్నారు.
News July 8, 2025
హైదరాబాద్: వైద్యశాఖలో ఉద్యోగాలు

హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (UPHCs) కాంట్రాక్ట్ పద్ధతిన 45 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతగా MBBS డిగ్రీతో పాటు తెలంగాణ వైద్య మండలిలో నమోదు తప్పనిసరి. నెలవారీ వేతనం రూ.52,000 ఉంటుంది. దరఖాస్తులు 09-07-2025 నుంచి 11-07-2025 మధ్య సికింద్రాబాద్ ప్యాట్నీలోని జిల్లా ఆరోగ్యాధికారికి సమర్పించవచ్చు.
SHARE IT
News July 8, 2025
నన్ను కూడా చంపేవారు: నల్లపురెడ్డి

AP: నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని తన ఇంటిపై జరిగిన దాడి <<16984961>>ఘటనపై <<>>వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. ‘నెల్లూరు జిల్లాలో దాడి సంస్కృతి ఎప్పుడూ లేదు. వేమిరెడ్డి దంపతులు ఇలాంటి రాజకీయం చేస్తారని అనుకోలేదు. నేను, నా కొడుకు బయటకెళ్లాక దాడి చేశారు. ఇంట్లో వస్తువులన్నీ ధ్వంసం చేశారు. దాడి సమయంలో ఇంట్లో ఉన్న మా అమ్మను బెదిరించారు. ఇంట్లో ఉంటే నన్ను కూడా చంపేవారు’ అని ఆరోపించారు.