News July 8, 2025
అమ్మ పేరుతో ఓ మొక్క నాటించాలి: కలెక్టర్

ఏక్ పేడ్.. మాకే నామ్ (అమ్మ పేరుతో ఓ మొక్క) విద్యార్థులు నాటేలా అవగాహన కల్పించాలని బాపట్ల కలెక్టర్ వెంకట మురళి సోమవారం ఆదేశించారు. పాఠశాలల ప్రాంగణాలు, ఇళ్ల వద్ద నాటే మొక్కల బాధ్యత విద్యార్థులదేనన్నారు. విద్యార్థులకు అవసరమైన మొక్కలు సిద్ధంగా ఉంచామని అన్నారు. మంగళవారం మొక్కలు నర్సరీల నుంచి ఆయా మండలాలకు చేరతాయన్నారు. వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు.
Similar News
News July 8, 2025
UAE గోల్డెన్ వీసా.. వలసలు పెరుగుతాయా?

UAE <<16970784>>గోల్డెన్ వీసాతో<<>> భారతీయులు ఆ దేశంలో స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో రూ.4.66 కోట్ల పెట్టుబడి పెడితేనే ఈ వీసా వచ్చేది. ఇప్పుడు రూ.23 లక్షలు చెల్లిస్తే చాలు జీవితకాలం చెల్లుబాటయ్యే వీసా వస్తుంది. గోల్డెన్ వీసా పొందిన వ్యక్తులు తమ కుటుంబసభ్యులను అక్కడికి తీసుకెళ్లొచ్చు. వ్యాపారం, ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ దేశంలో తక్కువ పన్నులు, మెరుగైన మౌలిక వసతులు భారతీయులను ఆకర్షించొచ్చు.
News July 8, 2025
వేధింపులకు గురిచేయడం వలనే ఆత్మహత్య చేసుకుంది: ఎస్సై

కొయ్యూరు మండలం రావణాపల్లిలో మౌనిక అనే వివాహిత తన కుమార్తె లాస్యశ్రీ(5)తో కలిసి ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిషోర్ వర్మ సోమవారం తెలిపారు. సతీశ్ కుమార్ను మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకుందన్నారు. సతీశ్ మద్యం తాగి ఇంటికి రావడం, అనుమానించడం, వేధింపులకు గురి చేయడం వలనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు.
News July 8, 2025
రేపు పార్వతీపురంలో జాబ్ మేళా

పార్వతీపురంలో రేపు జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఊపాధి కల్పన అధికారి ఆర్.వహీదా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేళా పార్వతీపురం జూనియర్ కళాశాలలో జరుగుతుందని, వివిధ ఫార్మా సంస్థలు 85 ఖాళీలను భర్తీ చేస్తాయని ఆమె చెప్పారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.