News July 8, 2025
ADB: దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి: కలెక్టర్ రాజర్షి షా

దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆకాంక్షించారు. వికలాంగుల ఆర్థిక పునరావాసం కోసం ఎంపిక చేసిన దివ్యాంగ లబ్ధిదారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తాతో కలిసి ఆయన ఉత్తర్వుల కాపీలను ఇచ్చారు. 15 మంది దివ్యాంగుల ఆర్థిక పునరావాసం కోసం 100% సబ్సిడీతో రూ.7.50 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ మిల్కా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News October 29, 2025
ఆదిలాబద్: ‘జనన బరువు ఆధారంగా శిశు మరణాల విశ్లేషణ చేయాలి’

ఆదిలాబాద్ జిల్లాలో నవజాత శిశు మరణాలను తగ్గించే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆరోగ్య శాఖ, వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. బీబీనగర్ ఎయిమ్స్ ప్రొఫెసర్ తనిగై నాథన్ జిల్లాలో గత నెలలో నమోదైన శిశు మరణాల గణాంకాలు, జనన బరువు ప్రకారం విభజన, సంబంధిత గ్రామాలు, తల్లుల ఆరోగ్య వివరాలు, తీసుకున్న చర్యలు తదితర అంశాలను వివరించారు.
News October 28, 2025
ఆదిలాబాద్: పోగొట్టుకున్న బ్యాగ్ను బాధితురాలికి అప్పగించిన పోలీసులు

గ్రామానికి వెళ్లే క్రమంలో సునీత అనే మహిళ బంగారు, వెండి ఆభరణాలు ఉన్న బ్యాగును ఆటోలో మరిచిపోయింది. ఈ విషయంపై వెంటనే ఆదిలాబాద్ బస్టాండ్లోని పోలీస్ సబ్ కంట్రోల్లో ఫిర్యాదు చేయగా స్పందించిన ఏఆర్ ఎస్ఐ ఎల్.దినకర్, మహిళా కానిస్టేబుల్ అపర్ణ కలిసి బాధితురాలు సునీత, పిల్లలు తెలిపిన ఆధారాల ప్రకారం ఆటో కోసం వెతకారు. ఆటోడ్రైవర్ జావిద్ నిజాయతీ చాటుకుని తిరిగి తన బ్యాగ్ను బాధితురాలికి అందించారు.
News October 28, 2025
ఆదిలాబాద్: ‘ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’

ANM, ఆశావర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో ప్రతి గర్భిణిని గుర్తించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తల్లుల పోషకాహారం లోపం, గర్భధారణ సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం, అనారోగ్య పరిస్థితుల్లో సమయానికి వైద్యసేవలు అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందన్నారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.


