News March 30, 2024
విశాఖ: ప్రయాణికులకు గుడ్ న్యూస్

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖ మీదుగా వెళ్లే ప్రత్యేక రైళ్లను మరికొద్ది రోజులు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం (08579/08580) రైళ్లను జూన్ 27 వరకు, విశాఖ-తిరుపతి-విశాఖ రైళ్లను జూన్ 25 వరకు, విశాఖ-కర్నూలు-విశాఖ రైళ్లను జూన్ 26 వరకు పొడిగించినట్లు తెలిపింది.
Similar News
News September 9, 2025
మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు I.F.Cతో ఒప్పందం

మధురవాడ సీవరేజ్ ప్రాజెక్టుకు జీవీఎంసీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (I.F.C.) మధ్య ఒప్పందం కుదిరింది. రూ.553 కోట్లు చేపట్టనున్న ఈ ప్రాజెక్టు కోసం విజయవాడలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం జరిగింది. ఐ.ఎఫ్.సి.తో దేశంలో తొలిసారి జీవీఎంసీ ఒప్పందం కుదుర్చుకుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ ప్లాంట్ 225 ఎం.ఎల్.డి వ్యర్థచరాలను శుద్ధి చేస్తుందని చెప్పారు
News September 8, 2025
విశాఖ జిల్లాలో 67.56% స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ పూర్తి

విశాఖ జిల్లాలో కేటాయించిన 5,17,155 స్మార్ట్ రైస్ కార్డులలో 67.56% పంపిణీ పూర్తయింది. మండలాల వారీగా అనందపురం 84.35%, భీమునిపట్నం 79.74%, సర్కిల్-III అర్బన్ 71.93%, సర్కిల్-I అర్బన్ 59.26% పూర్తి అయ్యాయి. మిగిలిన వారికి త్వరలోనే సచివాలయ సిబ్బంది/డీలర్ల ద్వారా అందజేస్తామని.. కార్డు వివరాలు epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ హరేంధీర ప్రసాద్ తెలిపారు.
News September 8, 2025
అధికారులపై విశాఖ కలెక్టర్ ఆగ్రహం

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారుల తీరుపట్ల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పీజీఆర్ఎస్లో గతవారం ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. జీవీఎంసీ, పోలీసు శాఖ ఫిర్యాదుల్లో నాణ్యమైన పరిష్కారం దొరకడం లేదన్నారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగంపై తరచూ ఫిర్యాదులు రావడంపై మండిపడ్డారు. ఇలాంటి తీరు పునరావృతం అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.