News July 8, 2025

తమిళ రీమేక్ చేయనున్న నాగార్జున?

image

నాగార్జున ఓ రీమేక్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. శశికుమార్ నటించిన ‘అయోతి’ అనే తమిళ మూవీని నాగ్ రీమేక్ చేయనున్నట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. ఈ మూవీ 2023లో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి R.మంతిర మూర్తి దర్శకత్వం వహించారు. ఇందులో ఎమోషన్స్, కథ, కథనం గురించి ఆడియన్స్ ప్రత్యేకంగా మాట్లాడుకున్నారని, కమర్షియల్‌గానూ వర్కౌట్ అవుతుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 8, 2025

జన సమీకరణకు ప్రయత్నిస్తే కేసులు: ఎస్పీ

image

AP: చిత్తూరు(D) బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో SP మణికంఠ చందోలు YCP నేతలను హెచ్చరించారు. ‘ఇది రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే. కొందరు జన సమీకరణ చేసి బహిరంగ సభలా మార్చాలని చూస్తున్నారు. ర్యాలీలకు సిద్ధమవుతున్నారు. వారిపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేస్తాం. ఇప్పటివరకు 375 మందికి నోటీసులు జారీ చేశాం’ అని వివరించారు. కాగా జగన్ టూర్‌లో 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.

News July 8, 2025

ఏ వయసు వారికి ఎంత నిద్ర అవసరమంటే?

image

అప్పుడే పుట్టిన పిల్లలతో పోల్చితే వయస్సు పెరిగే కొద్దీ నిద్ర సమయాలు తగ్గుతుంటాయని వైద్యులు చెబుతున్నారు. నవజాత శిశువులకు (0-3 నెలలు) రోజుకు 14-17 గంటల నిద్ర అవసరమని సూచిస్తున్నారు. అదే టీనేజర్లు (14-17ఏళ్లు) 8-10 గంటలు, యువకులు(18-25) 7-9 గంటలు నిద్రపోవాలని తెలియజేస్తున్నారు. అంత కంటే ఎక్కువ వయస్సున్న వారు 7-8 గంటలు నిద్రపోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. మీరు ఎంత సేపు నిద్రపోతున్నారు? COMMENT

News July 8, 2025

భర్తను నరికి చంపిన ఇద్దరు భార్యలు

image

TG: ఇద్దరు భార్యల చేతిలో ఓ భర్త ప్రాణాలు కోల్పోయిన ఘటన జనగామ జిల్లాలో జరిగింది. లింగాలఘణపురం(M) పిట్టలోనిగూడేనికి చెందిన కాలియా కనకయ్య(30)కు భార్యలు శిరీష, గౌరమ్మ(అక్కాచెల్లెళ్లు) ఉన్నారు. ఇటీవల వారి తల్లిని కనకయ్య చంపేశాడు. అప్పటి నుంచి భార్యలు పుట్టింట్లోనే ఉన్నారు. జైలు నుంచి వచ్చాక కాపురానికి రావాలంటూ వారిని బెదిరించడంతో కోపోద్రిక్తులైన ఇద్దరు భార్యలు కనకయ్యను గొడ్డలితో నరికి చంపారు.