News July 8, 2025

దువ్వాడ మీదగా రెండు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ తగ్గించేందుకు దువ్వాడ మీదగా రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. సంత్రగచి – యశ్వంతపూర్ (02863/64) జూలై 10నుంచి ఆగష్టు 28వరకు ప్రతి శనివారం నడపనున్నట్లు పేర్కొన్నారు. షాలిమార్ – చెన్నై సెంట్రల్ (02841/42) జూలై 14 నుంచి జూలై 28వరకు ప్రతి సోమవారం నడపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.

Similar News

News July 8, 2025

అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధి: కలెక్టర్

image

కోనసీమ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి గోదావరి నది తీర ప్రాంతం వెంబడి 6 అడ్వెంచర్ టూరిజం పాయింట్ల అభివృద్ధికి టెండర్లను పిలవడం జరిగిందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన పర్యాటకరంగ, అడ్వెంచర్ టూరిజం ఏజెన్సీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. టెండర్ ప్రతిపాదనలపై ఆయన వారితో సమీక్షించి సూచనలు చేశారు.

News July 8, 2025

రాజమండ్రిలో వద్ద ‘దిశ’ సమావేశం

image

రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మంగళవారం ‘దిశ’ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందీశ్వరి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ ప్రశాంతి పాల్గొన్నారు.

News July 8, 2025

ADB నుంచి JBSకు నాన్ స్టాప్ BUS

image

ఆదిలాబాద్ నుంచి జేబీఎస్‌కు ఈనెల 10 నుంచి నాన్ స్టాప్ ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ఈ సర్వీస్ ఆదిలాబాద్ నుంచి ఉదయం 4.45 గంటలకు బయలుదేరి బైపాస్ మీదుగా ఉదయం 10:15 గంటలకు JBS చేరుకుంటుందన్నారు. సాయంత్రం 05.30కి అక్కడి నుంచి బయలుదేరి సింగిల్ స్టాప్ నిర్మల్ వెళ్లి ADBకు రాత్రి 11.15కి వస్తుందని చెప్పారు.