News July 8, 2025

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేడు సీత్లా పండుగ

image

బంజారాలు ఈ ఏడాదిలో జరుపుకునే మొదటి పండుగ సీత్లా. ముఖ్యంగా బంజారా తెగలో ప్రకృతిని, పశుసంపదను, పంటలను కాపాడే దేవతైన సీత్లా మాతను పూజిస్తారు. పండుగను ఏటా ఆషాఢమాసంలో జరుపుకుంటారు. భవానీ మాతకు మహిళలు నైవేద్యంగా పాయసం, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, గుగ్గిళ్లను సమర్పిస్తారు. మీ తండాల్లో ఈరోజు సీత్లా పండుగ జరుపుకుంటున్నారా?.. COMMENT చేయండి.

Similar News

News July 8, 2025

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి: జనగామ కలెక్టర్

image

జనగామలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం పరిశీలించారు. 21వ వార్డు కుర్మవాడకు చెందిన దివ్యాంగుడు పర్ష సాయి కుటుంబానికి మంజూరైన ఇంటి పనులను పర్యవేక్షించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. దశల వారీగా నిధులు విడుదలవుతాయని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

News July 8, 2025

సిగాచీలో ముగిసిన NDMA బృందం పరిశీలన

image

TG: పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో NDMA బృందం పరిశీలన ముగిసింది. ప్రమాద స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పేలుడుకు గల కారణాలపై బృందం అధ్యయనం చేసింది. దీనిపై నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనుంది. కాగా ఈ ఘటనలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 44కు చేరింది. ప్రమాదం జరిగి 9 రోజులవుతున్నా ఇంకా పలువురి ఆచూకీ లభ్యం కాలేదు.

News July 8, 2025

జగిత్యాల: కుటుంబ సభ్యులే కాలయముళ్లు!

image

జగిత్యాల జిల్లా కోరుట్లలో గతంలో జరిగిన దీప్తి హత్య కేసులో, మొన్న జరిగిన చిన్నారి హితీక్ష హత్య కేసులో రక్త సంభందికులే హంతకులుగా తేలారు. ఈ రెండు హత్యకేసులు అప్పుడు, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. దీప్తి హత్య కేసులో సొంత చెల్లెలు చందన, ఆమె ప్రియుడు ఉమర్ నేరస్థులు కాగా, హితీక్ష హత్య కేసులో పిన్నీ(బాబాయి భార్య) మమత హంతకురాలు అయ్యింది.