News July 8, 2025
బాధితులకు సత్వర న్యాయం జరగాలి: SP అశోక్ కుమార్

జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా SP అశోక్ కుమార్ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం జరగాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ శాఖ మరింత చేరువవ్వాలన్నారు.
Similar News
News July 8, 2025
రేపు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు రాష్ట్ర క్యాబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు అమరావతిలోని సచివాలయంలో సమావేశం ప్రారంభం కానుంది. రాజధాని ప్రాంతంలో మరో 20వేల ఎకరాల భూసమీకరణ, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం, రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.
News July 8, 2025
పలు అంశాలపై నిర్మల్ కలెక్టర్ సమీక్ష

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవసరాలకు సరిపడినంత ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఇసుక లభ్యత, వివిధ నిర్మాణాలకు సేకరణ, అక్రమ రవాణా నియంత్రణ, భూ భారతి చట్టం, సీఎంఆర్ డెలివరీ, రేషన్ కార్డులు, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. వచ్చే సంవత్సరం మార్చి నెల వరకు వివిధ ప్రభుత్వ నిర్మాణాలకు అవసరమగు ఇసుక అంచనా నివేదికను సిద్ధం చేయాలన్నారు.
News July 8, 2025
మహదేవపూర్: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వాల్ కొటేషన్స్

మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఎస్ఐ జి.తమాషారెడ్డి ఆధ్వర్యంలో గోడలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలంటూ వాల్ కొటేషన్స్ ద్వారా మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి గ్రామంలో “మన ఊరు-మన పోలీస్” కార్యక్రమంలో భాగంగా ఒక పోలీస్ అధికారిని నియమిస్తున్నామని, ప్రజలకు అన్నివేళలో అందుబాటులో ఉంటూ, సమస్యలను తెలుసుకొని న్యాయం చేస్తామని ఎస్ఐ అన్నారు.