News July 8, 2025
తూ.గో: BLOలకు శిక్షణ తరగతులు

జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోని BLOలకు భారత IIIDEM ఆధ్వర్యంలో 9వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. మొత్తం 1,581 మంది BLOs పాల్గొంటారని, వీరికి 6 బ్యాచులుగా శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు.
Similar News
News July 8, 2025
ధవలేశ్వరంలో 11 కిలోల గంజాయి స్వాధీనం

ధవళేశ్వరంలో 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సీఐ టి.గణేశ్ తెలిపారు. కడియం సీఐ వెంకటేశ్వరరావు, ధవళేశ్వరం ఎస్ఐ హరిబాబు, ఈగల్ టీమ్తో కలిసి పీవీఆర్ పీ లేఅవుట్లో దాడి చేసి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను కోర్టుకు హాజరుపరుస్తామని సీఐ వెల్లడించారు.
News July 8, 2025
తూ.గో: రేపు దేశవ్యాప్త సమ్మె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలని గోపాలపురం ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ బుధవారం దేశవ్యాప్త సమ్మె చేపడుతున్నామని తెలిపారు. ఈ మేరకు సమ్మె పత్రాలను వైద్యులకు అందజేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.10 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు.
News July 8, 2025
తూ.గో జిల్లాలో “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”

తూ.గో జిల్లా ఎస్పీ డి. నరసింహాకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్”ను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలకు 100 గజాల దూరంలో ఉన్న షాపులు, దుకాణాలపై స్పెషల్ డ్రైవ్లు నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తులు అమ్మరాదని పేర్కొన్నారు.