News July 8, 2025

జేపీ నడ్డాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

image

TG CM రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. తాజాగా ఆయన కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కొరతపై చర్చించారు. ఇప్పటివరకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయిందని, మరో 3 లక్షల టన్నులు రావాల్సి ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా యూరియాతో పాటు ఎరువులు సరఫరా చేయాలని కోరారు. కొద్దిసేపట్లో పీయూష్ గోయల్‌తోనూ సీఎం రేవంత్ సమావేశం కానున్నారు.

Similar News

News July 9, 2025

అమర్‌నాథ్ యాత్రకు 6 రోజుల్లోనే లక్షమంది

image

ఈనెల 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రకు భక్తులు పెద్దఎత్తున తరలివెళ్తున్నారు. మొదటి 6 రోజుల్లోనే దాదాపు లక్షమంది భక్తులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నట్లు J&K LG మనోజ్ సిన్హా ట్వీట్ చేశారు. గతేడాది 52 రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర ఈసారి మాత్రం 38 రోజులు మాత్రమే కొనసాగనుంది. రెండు మార్గాల్లోనూ యాత్ర సజావుగా సాగుతోంది. ఈసారి మొత్తం 5 లక్షల వరకు భక్తులు యాత్రలో పాల్గొంటారని ఆలయ బోర్డు భావిస్తోంది.

News July 9, 2025

బ్రెజిల్ అధ్యక్షుడు, ప్రజలకు కృతజ్ఞతలు: మోదీ

image

బ్రెజిల్ నుంచి అత్యున్నత పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తానని ప్రధాని మోదీ తెలిపారు. ‘ది గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ అవార్డు అందుకోవడంపై అధ్యక్షుడు లూలా, బ్రెజిల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది భారతదేశ ప్రజల పట్ల బ్రెజిల్ ప్రజలకు ఉన్న బలమైన అభిమానాన్ని వివరిస్తుంది అన్నారు. రాబోయేకాలంలో ఇరు దేశాల స్నేహం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

News July 9, 2025

జులై 9: చరిత్రలో ఈరోజు

image

1875: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ స్థాపన
1926: దివంగత మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య జననం
1927: దివంగత నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు జననం(ఫొటోలో)
1930: దివంగత దర్శకుడు కె. బాలచందర్ జననం (ఫొటోలో)
1949: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆవిర్భావం
1966: గాయకుడు ఉన్నికృష్ణన్ జననం
1969: ‘పులి’ భారత జాతీయ జంతువుగా ప్రకటన
1969: మాజీ క్రికెటర్ వెంకటపతిరాజు జననం