News July 8, 2025
ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోం: మంత్రి సురేఖ

TG: భద్రాచలం ఈవో రమాదేవిపై <<16992146>>దాడిని<<>> దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. ఈవోలపై దాడులు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. దాడి జరిగిన ప్రాంతం ఏపీ పరిధిలోనిది కావడంతో సీఎం చంద్రబాబు కలగజేసుకొని, సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆమె కోరారు. తెలంగాణలో ఎండోమెంట్ భూములను కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని సురేఖ హెచ్చరించారు.
Similar News
News July 9, 2025
హజ్ యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

ముస్లింలు పవిత్రంగా భావించే హజ్ యాత్ర 2026కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నెల 31 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఇంటర్నేషనల్ పాస్ పోర్టును కలిగి ఉండటం తప్పనిసరని పేర్కొంది. యాత్రికులు hajcommittee.gov.in లేదా HAJ SUVIDHA మొబైల్ యాప్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరణం, ఎమర్జెన్సీ మినహాయించి యాత్రను క్యాన్సిల్ చేసుకుంటే జరిమానా తప్పదని స్పష్టం చేసింది.
News July 9, 2025
నేడు క్యాబినెట్ భేటీ

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.
News July 9, 2025
ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు మాంచెస్టర్లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్లోకి రావడం భారత్కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.