News July 8, 2025

మహబూబాబాద్: BRSకు డిపాజిట్ దక్కదు: డిప్యూటీ సీఎం

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో BRSకు డిపాజిట్ దక్కదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం MHBDలో ఆయన మాట్లాడారు. కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు CM రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అసెంబ్లీకి KCR చర్చకు రావాలన్నారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, కృష్ణ, గోదావరి నీళ్లు వాడుకోండని ఏపీలో ఆనాడు సీఎంగా ఉన్న KCR ప్రకటించారా?లేదా అని ప్రశ్నించారు.

Similar News

News July 9, 2025

ప్రజలకు కామారెడ్డి ఎస్సీ సూచనలు

image

కామారెడ్డి జిల్లా ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. వర్షం కురిసినప్పుడు రోడ్లు తడిగా ఉండి వాహనాలు జారే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా వాహనాలు నడపాలన్నారు. వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడటం ప్రమాదకరమని, పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. విద్యుత్ తీగలు, స్తంభాలతో పాటు పాత ఇండ్లకు దూరంగా ఉండాలని SP విజ్ఞప్తి చేశారు.

News July 9, 2025

నేడు స్కూళ్లకు బంద్ ఉందా?

image

నేడు ‘భారత్ బంద్’ ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనున్నాయి. బంద్‌కు మద్దతుపై ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయ సంఘాలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అటు విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటిస్తాయి. కానీ ఇవాళ కార్మిక సంఘాలు మాత్రమే బంద్‌లో పాల్గొంటున్నాయి. దీంతో ప్రైవేట్ స్కూళ్లు సైతం తెరిచే ఉండనున్నాయి. బంద్ ఉంటుందని తల్లిదండ్రులకు సైతం మెసేజ్ రాలేదు.

News July 9, 2025

సిద్దుల గుట్టలో తలనీలాల వేలం రూ.2,35,500

image

బచ్చన్నపేట మండలం కొడవటూరు సిద్దుల గుట్ట స్వయంభు సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో తలనీలాల వేలంపాట జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వేలం పాటలో రూ.2,35,500 ఆదాయం లభించిందని ఆలయ ఈవో వంశీ తెలిపారు. ఈ వేలం పాటను కొడవటూరుకు చెందిన నిడిగొట్టు చిరంజీవి గతేడాది కంటే రూ.3,500 ఎక్కువగా పాడి దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి, ఆలయ కమిటీ ఛైర్మన్ మల్లారెడ్డి పాల్గొన్నారు.