News July 8, 2025
రేపల్లెలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రేపల్లెలో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుడు నగరం మండలం దూళిపాళ్ల గ్రామం కొండవీటి మణిగ స్థానికులు గుర్తించారు. యువకుడు 17645 నంబరు రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే సూపరింటెండెంట్, జీఆర్పీ ఆర్బీఎఫ్ సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News July 9, 2025
పటాన్చెరు: నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని.. హత్య

రామచంద్రపురంలో జరిగిన <<16980046>>హత్య కేసు<<>>లో ప్రియుడు, MDK జిల్లా వాసి ప్రవీణ్కుమారే రమ్యను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. తమ ప్రేమకు యువతి పేరెంట్స్ నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కనిది.. ఇంకెవరికీ దక్కొద్దనే ఉద్దేశంతో సోమవారం రమ్య తల్లిదండ్రులు డ్యూటీలకు వెళ్లగా ఇంట్లోకి వెళ్లిన ప్రవీణ్ గొడవ పడి కత్తితో రమ్య గొంతుకోసి హత్య చేశాడు.
News July 9, 2025
కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. గాంధారిలో 14మి.మీ, IDOC (కామారెడ్డి) 6.8, సర్వాపూర్, నసురుల్లాబాద్, బొమ్మన్ దేవిపల్లి 5, రామలక్ష్మణ పల్లి 4.3, వెల్పుగొండ 3.5, ఇసాయిపేట 1.8, పాత రాజంపేట, కొల్లూరు 1.5, తాడ్వాయి 1.3, బిక్కనూర్ 1, లచ్చపేట, మేనూరు, దోమకొండలో 0.8మి.మీలుగా నమోదైంది.
News July 9, 2025
MHBD: స్థానిక ఎన్నికలు.. ఆశావహుల్లో టెన్షన్ టెన్షన్!

ఈ నెలాఖరులో పంచాయతీ, MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారంతో ఆశావహ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. రిజర్వేషన్ కలిసి రాకపోతే పరిస్థితి ఏంటని మహబూబాబాద్ జిల్లాలో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఆలోచనలో పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో పరిస్థితులు అనుకూలించకపోతే, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. మీ స్థానికంగా ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది?