News July 8, 2025
CBSE: సప్లిమెంటరీ హాల్టికెట్లు విడుదల

10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్టికెట్లను CBSE రిలీజ్ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ స్టూడెంట్స్ తమ స్కూళ్లలో హాల్ టికెట్లు కలెక్ట్ చేసుకోవాలని పేర్కొంది. కాగా ఈనెల 15 నుంచి 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. 10 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.
Similar News
News July 9, 2025
నేడు క్యాబినెట్ భేటీ

AP: ఈరోజు ఉ.11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. రాజధాని కోసం మలివిడతలో 20,494 ఎకరాల భూ సమీకరణ, 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పునర్విభజనపై చర్చించనుంది. అమరావతికి ఇసుకను డ్రెడ్జింగ్ చేసుకునేందుకు CRDAకు అనుమతి ఇవ్వనుంది.
News July 9, 2025
ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు మాంచెస్టర్లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్లోకి రావడం భారత్కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.
News July 9, 2025
రేపు మరో 9.51 లక్షల మందికి ‘తల్లికి వందనం’

AP: రేపు మరో 9.51 లక్షలమంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు. వారికీ రేపు నగదు జమ చేయనున్నారు.