News July 8, 2025

జనగామ: ‘సమ్మెను విజయవంతం చేయాలి’

image

రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆటో కార్మికులు అన్నారు. జనగామలోని రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో ఈరోజు ఆటో కార్మికులు సమావేశాలను నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. CITU జిల్లా కమిటీ మెంబర్ ప్రశాంత్, ఆటో యూనియన్ నేతలు మల్లేశ్, అశోక్, అలీ, భాస్కర్ తదితరులు ఉన్నారు.

Similar News

News July 9, 2025

ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

image

ఇంగ్లండ్‌తో భారత మహిళల జట్టు మాంచెస్టర్‌లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్‌లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్‌పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్‌లోకి రావడం భారత్‌కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.

News July 9, 2025

VKB: మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల బీమా

image

మహిళా సంఘాల సభ్యులకు రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉందని అదనపు డీఆర్‌డీఏ నర్సింలు అన్నారు. తాండూరు ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మహిళా సంఘాల సభ్యులతో మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు అందిస్తున్న రుణాలు, ఇతర సదుపాయాలపై చర్చించారు. గ్రామాల్లో మహిళా సంఘాలను బలోపేతం చేయాలని నర్సింలు అన్నారు. సంఘంలో లేని మహిళలను నూతన సంఘంలో చేర్పించి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

News July 9, 2025

కృష్ణా: ఉచిత బస్సుపై ఆ ప్రాంతాల ప్రజలకు నిరాశ.!

image

పెనమలూరు, గన్నవరం మండలాలవారు నిత్యం విజయవాడ నగరానికి ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రయాణిస్తుంటారు. అయితే సీఎం చంద్రబాబు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం జిల్లాకే పరిమితం అన్న స్పష్టతతో ఆ ప్రయాణికుల్లో అసంతృప్తి నెలకొంది. కానీ ఈ మండలాల నుంచి విజయవాడ కూతవేటు దూరంలో ఉన్నా ఉచిత ప్రయాణం వర్తించకపోవడం విద్యార్థులు, ఉద్యోగులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. దీనిపై మీ కామెంట్.!