News March 30, 2024
రష్యాలో భారతీయులకు నరకం! – 1/2
ఉక్రెయిన్పై యుద్ధం కోసం రష్యన్ ఏజెంట్లు విదేశీయులను ట్రాప్ చేస్తున్నారు. హరియాణా యువకులు ముకేశ్ (21), సన్నీ (24) సైతం ఇలాగే మోసపోయి నరకం అనుభవించారు. జర్మనీలోని ఓ హోటల్లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బ్యాంకాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి వీరిని బెలారస్-రష్యా బోర్డర్కు తరలించారట. అడవుల్లోని క్యాంపుల్లో బంధించి చిత్రహింసలు పెట్టారట. ఇలా దక్షిణాసియాకు చెందిన దాదాపు 200 మంది చిక్కుకున్నారట.
Similar News
News October 5, 2024
ఫొటో గ్యాలరీ.. హంసవాహనంపై తిరుమలేశుడు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజైన ఇవాళ వేంకటేశ్వరుడు హంసవాహనంపై తిరుమల మాడ వీధుల్లో విహరించారు. సరస్వతీమూర్తి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కనులపండువగా సాగిన మహోత్సవ ఫొటోలను పైన గ్యాలరీలో చూడొచ్చు.
News October 5, 2024
బంగ్లాతో టీ20 సిరీస్కు తిలక్ వర్మ
టీమ్ ఇండియా ఆల్రౌండర్ శివమ్ దూబే వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. దీంతో ఆయన రేపటి నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. దూబే స్థానంలో హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. త్వరలోనే తిలక్ జట్టుతో కలుస్తారని తెలుస్తోంది. కాగా రేపు రాత్రి 7.30 గంటలకు గ్వాలియర్లో భారత్, బంగ్లా మధ్య తొలి టీ20 ప్రారంభం కానుంది.
News October 5, 2024
సోషల్ మీడియాలో దుష్ప్రచారం.. CBN ఆగ్రహం
AP: ఉచిత ఇసుకపై సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగానే దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకోవాలంటూ గనులశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ప్రజలను తప్పుదారి పట్టించే దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కావాలనే కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని సీఎం దుయ్యబట్టారు.