News July 9, 2025
ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
Similar News
News July 9, 2025
తిరుమలలో మొదట ఎవరిని దర్శించుకోవాలంటే?

తిరుమల కొండపైకి చేరుకోగానే చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనం కోసం క్యూ కడుతుంటారు. నిజానికి తిరుమల ఆదివరాహ క్షేత్రం. అందువల్ల తిరుమలకు వచ్చే భక్తులు తొలుత పుష్కరిణి పక్కనే ఉన్న వరాహ క్షేత్రాన్ని దర్శించుకోవాలనే ఆచారం ఉంది. ఈ విషయాన్ని ‘TTD అప్డేట్స్’ X వేదికగా పేర్కొంటూ భక్తులకు అవగాహన కల్పిస్తోంది. వెంకటేశ్వర స్వామి వాగ్దానం ప్రకారం.. వరాహ స్వామికి మొదటి పూజ, నైవేద్యం సమర్పిస్తారని ప్రతీతి.
News July 9, 2025
లార్డ్స్లో పరుగుల వరద కష్టమే?

టీమ్ఇండియా పరుగుల వరదకు అడ్డుకట్ట వేసేందుకు లార్డ్స్లో ‘గ్రాస్ టాప్ పిచ్’ రెడీ చేసినట్లు తెలుస్తోంది. పిచ్ మీద గ్రాస్ ఎక్కువుంటే బ్యాటింగ్ కష్టమవుతుంది. ముఖ్యంగా పేసర్లకు పిచ్ సహకరించే అవకాశం ఎక్కువ. మూడో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు ఆర్చర్, అట్కిన్సన్ ఉండే అవకాశాలున్నాయి. వారికి ఈ పిచ్ అనుకూలంగా ఉండొచ్చు. అయితే, ఆకాశ్ దీప్ ఫామ్లో ఉండటం, బుమ్రా కంబ్యాక్ టీమ్ఇండియాకి కూడా కలిసొచ్చే ఛాన్సుంది.
News July 9, 2025
32.39 కోట్ల మంది ఖాతాల్లో PF వడ్డీ జమ

EPFO ఖాతాల్లో 2024-25 సంవత్సరానికి 8.25శాతం <<16951029>>వడ్డీని <<>>కేంద్రం జమ చేస్తోంది. 33.56 కోట్ల మంది సభ్యులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన 32.39 కోట్ల మంది ఖాతాల్లో వడ్డీ జమ ముగిసినట్లు కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. మిగతా వారికి కూడా ఈ వారంలోనే జమ చేస్తామని తెలిపారు. గత ఏడాది ఆగస్టు-డిసెంబర్ మధ్య వడ్డీ జమ జరగ్గా, ఈ సారి జులైలోనే పూర్తికానుంది. మీ PF ఖాతాల్లో వడ్డీ జమ అయ్యిందా?