News July 9, 2025
ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకు?: KTR

TG: చర్చకు వచ్చే ధైర్యం లేనప్పుడు సవాల్ విసరడం ఎందుకని సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతు సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలని ఆయనే సవాల్ విసిరారు. నేను దాన్ని స్వీకరించి, 72 గంటల నోటీస్ ఇచ్చా. ఇవాళ అందరి సమక్షంలో గంటపాటు వేచి చూసినా ఆయన రాలేదు. ఇంతమాత్రం దానికి సవాల్ విసరడం ఎందుకు రేవంత్ రెడ్డి?’ అని ట్వీట్ చేశారు. దీనికి ‘కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ’ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
Similar News
News July 9, 2025
ఇవాళ గెలిస్తే సిరీస్ మనదే..

ఇంగ్లండ్తో భారత మహిళల జట్టు మాంచెస్టర్లో ఇవాళ నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. 2-1తో లీడింగ్లో ఉన్న టీమ్ ఇండియా సిరీస్పై కన్నేసింది. షెఫాలీ తిరిగి ఫామ్లోకి రావడం భారత్కు ప్లస్. బౌలర్లు సత్తా చాటుతుండగా బ్యాటర్లు మరింత దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. మరోవైపు మూడో T20లో గెలుపుతో ఇంగ్లండ్ జోరు మీద ఉంది. ఇవాళ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని ఆ జట్టు చూస్తోంది. మ్యాచ్ రాత్రి 11 గంటలకు ప్రారంభం కానుంది.
News July 9, 2025
రేపు మరో 9.51 లక్షల మందికి ‘తల్లికి వందనం’

AP: రేపు మరో 9.51 లక్షలమంది విద్యార్థులకు తల్లికి వందనం డబ్బు జమ చేయనున్నారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇటీవల వీరిని మినహాయించి మిగిలిన వారికి నిధులు జమ చేసిన విషయం తెలిసిందే. గ్రామ, వార్డు సచివాలయాల్లో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించగా 1.34 లక్షల మంది అర్హులుగా తేలారు. వారికీ రేపు నగదు జమ చేయనున్నారు.
News July 9, 2025
నేడు కాళేశ్వరంపై మంత్రి ఉత్తమ్ PPT

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై నేడు ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PPT) ఇవ్వనుంది. ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఇటీవల పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై PPT ఇవ్వగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర వివరాలు తెలియజేయనున్నారు. BRS హయాంలో కృష్ణా జలాల లెక్కలను మంత్రి వివరించనున్నారు.