News March 30, 2024

బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

image

ఎన్నికల్లో 400 సీట్ల బంపర్ మెజార్టీనే లక్ష్యంగా పెట్టుకున్న BJP తమ మేనిఫెస్టోను సిద్ధం చేసే పనిపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. కన్వీనర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కో-కన్వీనర్‌గా వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ ఉన్నారు. ఈ 27 మంది సభ్యుల కమిటీలో అశ్వినీ వైష్ణవ్, స్మృతీ ఇరానీ మొదలైన కేంద్ర మంత్రులూ ఉన్నారు.

Similar News

News April 18, 2026

వేగంగా కోలుకుంటున్నా.. త్వరలోనే యాక్షన్‌లోకి: వరుణ్ తేజ్

image

‘బరి’ సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తూ <<19657793>>గాయపడిన<<>> మెగా హీరో వరుణ్ తేజ్ తన హెల్త్ అప్డేట్ వెల్లడించారు. సర్జరీ తర్వాత వేగంగా రికవరీ అవుతున్నానని ఇన్‌స్టాలో తెలిపారు. ఫుల్ స్ట్రెంత్‌తో తిరిగొస్తానని పేర్కొన్నారు. గతంలో కంటే బలంగా త్వరలోనే యాక్షన్‌లోకి దిగుతానన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ థాంక్స్ చెప్పారు. కాగా ఈ చిత్రాన్ని సోదరి నిహారిక నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

News April 18, 2026

అభిషేక్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

image

IPL: చెన్నైతో మ్యాచులో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడుతున్నారు. చెన్నై బౌలర్లపై విరుచుకుపడుతూ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అందులో 4 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. ‘పులి’కి IPLలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం. అటు హెడ్ (20 బంతుల్లో 23), ఇషాన్ కిషన్ (0) ఔటయ్యారు. ప్రస్తుతం 6 ఓవర్లలో స్కోర్ 75/2గా ఉంది.

News April 18, 2026

పవన్ కళ్యాణ్‌కు సర్జరీ

image

AP: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇవాళ సర్జరీ జరిగింది. నిన్న ఓ సమావేశంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడం, కొన్ని నెలలుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. వారం నుంచి పది రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే దీర్ఘకాలం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని, పూర్తిగా హెల్తీగా మారేందుకు ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు.