News March 30, 2024
అభ్యర్థిగా ప్రకటించి నెలవుతున్నా.. కనిపించని నామా..?
ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావును బీఆర్ఎస్ అన్ని పార్టీలకంటే ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. నామా పేరును ఖరారు చేసి నెలవుతున్నా ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టలేదట. కడియం కావ్య ఎఫెక్ట్తో కొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారంతో నామా పేరు తెరపైకి వస్తోంది. ఆయన పోటీలోనే ఉంటారా? లేక పోటీ నుంచి డ్రాప్ అవుతారా అనేది ఖమ్మం బీఆర్ఎస్లో చర్చనీయాంశమైనట్లు సమాచారం.
Similar News
News September 30, 2024
నేడు కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరెట్లో ఇవాళ జరిగే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొనే ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా సమర్పించాలని సూచించారు.
News September 29, 2024
తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖి
తెలంగాణలో గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను దుర్వినియోగపరిచిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. షామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీలో ఈరోజు 33 జిల్లాల తహశీల్దార్లతో మంత్రి ముఖాముఖి సమావేశమయ్యారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్తులు, స్థలాలు కాపాడే విషయంలో పేదలకు సహాయం అందించడంలో రెవెన్యూ యంత్రాంగం పనితీరు మరింత మెరుగుపడాలని మంత్రి పొంగులేటి చెప్పారు.
News September 29, 2024
HYDలో మధిర మండల వాసి మృతి
మధిర మండలం రాయపట్నంకి చెందిన కంపసాటి కొండ హైదరాబాదులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కోర్టు కేసులో జామీను కోసం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అతణ్ని హైదరాబాదుకు తీసుకెళ్లినట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సహజ మరణమా లేదా ఇతర కారణమా తెలియాల్సి ఉంది.