News March 30, 2024

పాండ్యపై ద్వేషం సరికాదు: అశ్విన్

image

రోహిత్‌ స్థానంలో MI కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన పాండ్యపై అభిమానుల ద్వేషం సరికాదని భారత క్రికెటర్ అశ్విన్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీ వంటి లెజెండరీ క్రికెటర్లపై చేసే కామెంట్స్ చూస్తుంటే క్రికెట్‌లో నెలకొన్న ద్వేషపూరిత వాతావరణం తెలుస్తుంది. గంగూలీ కింద సచిన్ ఆడారు. వారిద్దరూ ద్రవిడ్ కెప్టెన్సీలో ఆడారు. ఆ ముగ్గురు కుంబ్లే కెప్టెన్సీలో.. మళ్లీ వాళ్లంతా ధోనీ సారథ్యంలో ఆడారు’ అని అశ్విన్ గుర్తు చేశారు.

Similar News

News February 10, 2026

మాట్లాడుకుంటేనే సమస్యలకు పరిష్కారం

image

భార్యాభర్తల జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. కొన్నిసార్లు అహం అడ్డం, ఇంకొన్నిసార్లు అపార్థాలు పలకరిస్తాయి. అలకలూ ఉంటాయి. వాటిని దాటితేనే బంధం పదిలంగా మారుతుంది. అభిప్రాయ భేదాలు వచ్చి అలిగినా తెగేదాకా లాగొద్దు. భాగస్వామితో నేరుగానే మాట్లాడి పరిష్కరించుకోండి. సమస్య ఏదైనా ఎదుటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. లేదంటే సమస్య పరిష్కారం కాకపోగా అవతలివారిలో రోజు రోజుకీ అసంతృప్తి పెరిగిపోతుంది.

News February 10, 2026

మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారు

image

ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ భారత పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన ఇండియాలో పర్యటించి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 2047 వరకు ఇరుదేశాలు అనుసరించే వ్యూహాలపై చర్చిస్తారని తెలిపింది.

News February 10, 2026

వంట చేస్తూ మాట్లాడుతున్నారా?

image

వంట చేయడం ధ్యానం వంటిది. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే ఆహారం వండేటప్పుడు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. టీవీ చూస్తూనో, ఫోన్ మాట్లాడుతూనో వంట చేస్తే ఏకాగ్రత దెబ్బతింటుంది. మౌనంగా చేస్తే వంటకాలు మరింత రుచికరంగా తయారవుతాయని నమ్మకం. సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రశాంతంగా, ఏకాగ్రతతో వంట చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.