News July 9, 2025
VJA: ‘క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలను వినియోగించుకోండి’

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సౌజన్యంతో అమరావతిలో 2 రోజుల పాటు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేశామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఈ మేరకు ఆయన విజయవాడలోని తన కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10న తుళ్లూరు CHC, 11న యర్రబాలెం UHCలో ఈ శిబిరాలు జరుగుతాయన్నారు. క్యాన్సర్ నిర్ధారణ సేవలు, అవగాహన కార్యక్రమాలు ఈ క్యాంపుల ద్వారా అందిస్తున్నామని, స్థానికులు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News July 10, 2025
‘X’ CEO పదవికి లిండా రాజీనామా

ప్రముఖ SM యాప్ ‘X’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా చేశారు. తాను పదవి నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘రెండు అద్భుతమైన సంవత్సరాల తర్వాత నేను CEO హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కమ్యూనిటీ నోట్స్ ఆవిష్కరణల నుంచి, త్వరలో ప్రారంభంకానున్న X మనీ వరకు ఈ బృందం కృషి ఎంతో గొప్పది’ అని ట్వీట్ చేశారు. లిండా రాజీనామాపై ఎలాన్ మస్క్ ‘మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ స్పందించారు.
News July 10, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (జులై 10, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.27 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5.48 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.57 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.55 గంటలకు
✒ ఇష: రాత్రి 8.15 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News July 10, 2025
రొట్టెల పండగకు వచ్చిన 2 లక్షల మంది భక్తులు

నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా నాలుగో రోజైన బుధవారం 2 లక్షల మందికిపైగా భక్తులు దర్గాను దర్శించుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించింది. భక్తుల రద్దీతో స్వర్ణాల చెరువు ఘాట్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది.