News March 30, 2024

అన్నం తినేవాళ్లు పార్టీ మారరు: కౌశిక్ రెడ్డి

image

TG: అన్నం తినే వారు ఎవరూ పార్టీ మారరని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ‘కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారు. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది? ఆయన పార్టీని నమ్మించి గొంతు కోశారు. పార్టీలు మారే వారిని ప్రజలు ఛీ కొడుతున్నారు. ఆ నేతలకు పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిజం తెలుస్తుంది’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News April 17, 2026

ఏపీ SECగా అనిల్ చంద్ర.. గవర్నర్ ఆమోదం

image

AP: స్టేట్ ఎలక్షన్ కమిషనర్(SEC)గా రిటైర్డ్ ఐఏఎస్ అనిల్ చంద్ర పునేఠా నియమితులయ్యారు. ఆయన నియామకానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. కాసేపట్లో జీవో వెలువడనుంది. అనిల్ చంద్ర గతంలో రాష్ట్ర సీఎస్‌గా పనిచేశారు. రిటైరైన తర్వాత ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో విజిలెన్స్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. గత నెలాఖరుతో SECగా నీలం సాహ్ని పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే.

News April 17, 2026

సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్

image

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై లోక్‌సభలో ఓటింగ్ ఆలస్యం కానుంది. సా.4 గంటలకే ఓటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అమిత్ షా 6PMకు ఆ బిల్లులపై ప్రసంగించనున్నారు. షా స్పీచ్ తర్వాత ఓటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

News April 17, 2026

20న జేఈఈ మెయిన్ ఫలితాలు!

image

జేఈఈ మెయిన్-2026 ఫైనల్ ఆన్సర్ కీ, ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. jeemain.nta.nic.inలో అప్లికేషన్ నంబర్, బర్త్ డేట్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ నెల 2 నుంచి 8 వరకు జరిగిన సెషన్-2 పరీక్షలకు దేశవ్యాప్తంగా 11 లక్షల మందికి పైగా హాజరయ్యారు. NIT, IITలలో ప్రవేశాల కోసం జేఈఈ ఎగ్జామ్స్‌ను రెండు దశల్లో నిర్వహిస్తారు.