News July 9, 2025

భద్రాచలం ఈవోపై దాడి ఖండించిన మంత్రి తుమ్మల

image

భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం వాసులు భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈవోను ఫోన్‌లో పరామర్శించిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటామని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

Similar News

News July 10, 2025

HYD: స్వరూప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలింపు

image

కల్తీకల్లు తాగి మృతి చెందిన స్వరూప మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి కుటుంబ సభ్యులు తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చరికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాహన సంస్కారాలకు అన్ని సిద్ధం చేసుకుంటే అధికారులు ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. పోస్టుమార్టం నిమిత్తమై తరలించినట్లు అధికారులు తెలిపారు.

News July 10, 2025

MNCL: సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి

image

మంచిర్యాల జిల్లా సమగ్ర శిక్షా నూతన జెండర్ & డిప్యూటీ కోఆర్డినేటర్‌గా విజయలక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె దండేపల్లి మండలంలోని వెల్గనూర్ జడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో బాలికలకు భద్రత, భరోసాతో కూడిన నాణ్యమైన విద్య అందించి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఈఓ యాదయ్య సూచించారు.

News July 10, 2025

400 రన్స్ చేసే అవకాశాలు మళ్లీ మళ్లీ రావు: గేల్

image

SA కెప్టెన్ ముల్డర్ ఇటీవల టెస్టులో 400రన్స్ చేసే అవకాశం ఉన్నా వద్దనుకోవడం చర్చనీయాంశమైంది. దీనిపై WI క్రికెట్ దిగ్గజం గేల్ స్పందించారు. ఇటువంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావన్నారు. ఛాన్స్ దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తనకు ఇటువంటి అవకాశమొస్తే వదలనని చెప్పారు. లారా(400*) రికార్డును అధిగమించే ఉద్దేశం లేకే 367* స్కోర్ వద్ద డిక్లేర్ చేసినట్లు ముల్డర్ వెల్లడించిన విషయం తెలిసిందే.