News July 9, 2025
సికింద్రాబాద్ కంటోన్మెంట్కు మహర్దశ

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. రూ.160 కోట్లతో రెండు స్ట్రోం వాటర్ డ్రైన్లు, ఒకటి జూబ్లీ నుంచి ప్యాట్నీ వరకు, రెండోది రసూల్పూర బస్తీల మీదుగా మంజూరైంది. SNDP మాదిరిగా వీటిని నిర్మించనున్నారు. దీనితో కంటోన్మెంట్, బోయినపల్లికి వరద ముంపు నుంచి శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. రూ.128 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అభివృద్ధి చేయనున్నారు.
Similar News
News July 10, 2025
భువనగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మోత్కూర్ జామచెట్లబావి ఎక్స్ రోడ్డులో బుధవారం సాయంత్రం జరిగింది. స్థానికుల వివరాలిలా.. గుండాల మండలం వంగాలకి చెందిన చిప్పలపల్లి శంకర్ (48) టీవీఎస్పై మోత్కూర్ నుంచి ఇంటికి వెళుతున్నాడు. ఓ మైనర్ బాలుడు బైక్పై అతి వేగంగా వచ్చి శంకర్ వాహనాన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
News July 10, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News July 10, 2025
‘X’ CEO పదవికి లిండా రాజీనామా

ప్రముఖ SM యాప్ ‘X’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా చేశారు. తాను పదవి నుంచి తప్పుకున్నట్లు స్వయంగా ప్రకటించారు. ‘రెండు అద్భుతమైన సంవత్సరాల తర్వాత నేను CEO హోదా నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. కమ్యూనిటీ నోట్స్ ఆవిష్కరణల నుంచి, త్వరలో ప్రారంభంకానున్న X మనీ వరకు ఈ బృందం కృషి ఎంతో గొప్పది’ అని ట్వీట్ చేశారు. లిండా రాజీనామాపై ఎలాన్ మస్క్ ‘మీ సేవలకు ధన్యవాదాలు’ అంటూ స్పందించారు.