News July 9, 2025

పార్వతీపురం: 15 నుంచి పారిశుధ్య పక్షోత్సవాలు

image

పారిశుద్ధ్యం, వ్యక్తిగత పరిశుభ్రతను ప్రోత్సహించడానికి ఈనెల 15 నుంచి ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జూలై 15 నుంచి 30వ తేదీ వరకు పక్షోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ప్రజలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు.

Similar News

News July 11, 2025

షీలానగర్‌లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

image

షీలానగర్ సమీపంలోని మారుతి సర్కిల్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడకు చెందిన అశోక్ రెడ్డి బైకుపై వెళుతుండగా ట్రాలర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎయిర్ పోర్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు.

News July 11, 2025

ఈ నెల 15న ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం!

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ఈవీ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్‌లో కార్యకలాపాలకు సిద్ధమైంది. ఈ నెల 15న ముంబైలోని బాంద్రాలో ఆ కంపెనీ తొలి షోరూంను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్లు ముంబైకి చేరుకున్నాయని జాతీయ మీడియా పేర్కొంది. 2021 నుంచే టెస్లా భారత మార్కెట్‌లో ప్రవేశించాలని ప్రయత్నించినా కంపెనీ ఏర్పాటు చేయాలన్న భారత్ కండిషన్లతో ఆలస్యమైంది. కాగా ఢిల్లీలోనూ షోరూంను ప్రారంభిస్తారని సమాచారం.

News July 11, 2025

NGKL: బోరు మోటార్ వద్ద జాగ్రత్తలే రక్ష

image

వ్యవసాయ బోరు మోటార్ వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలి. పవర్ డబ్బాను నేరుగా తాకకుండా కర్రతో తెరవాలి. ఎందుకంటే వర్షాకాలం నేపథ్యంలో షాక్ సర్క్యూట్‌కు అవకాశం ఉంది. చల్లటి వాతావరణంతో పాములు మోటార్ డబ్బాల్లోకి ప్రవేశిస్తాయి. చేతితో తీస్తే వెంటనే కాటు వేసే ప్రమాదం ఉంది. నిన్న NGKL జిల్లా చారకొండ మండలంలో రైతు వెంకటనారి గౌడ్ మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్‌తో మృతి చెందాడు. ప్రతి ప్రాణం విలువైనదే. SHARE IT