News July 9, 2025
ములుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధం

జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని, గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు గోదావరిలో చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజ్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసే జులై, ఆగస్టు మాసంలో చేపల వేట నిషిద్ధమని తెలిపారు. చెరువులు మత్తడి పోస్తున్నప్పుడు మత్తడి ప్రాంతంలో సిమెంటు దిమ్మెలు, ఇనుప జాలీలు, కర్రలు, వలలు పెట్టడం వల్ల చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు
Similar News
News July 10, 2025
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.
News July 10, 2025
మెదక్: యాప్లో వివరాలు నమోదు చేయాలి: డీఈవో

మెదక్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ యాప్లో నమోదు చేయాలని డీఈవో రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. విద్యార్థులకు అందించిన పుస్తకాలు, యూనిఫామ్ వివరాలను యాప్లో నమోదు చేయాలన్నారు. నిర్లక్ష్యం వహించే ప్రధానోపాధ్యాయులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు.
News July 10, 2025
అనుపమ చిత్రంపై వెనక్కి తగ్గిన సెన్సార్ బోర్డు

అనుపమ, సురేశ్ గోపి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే జానకిvs స్టేట్ ఆఫ్ కేరళ. ఈ మూవీకి సెన్సార్ బోర్డు హీరోయిన్ పేరు మార్పు సహా 96 కట్స్ చెప్పింది. దీనిపై నిర్మాతలు కోర్టుకెళ్లగా సెన్సార్ బోర్డు వెనక్కి తగ్గింది. కేవలం రెండే మార్పులు చెప్పింది. మూవీ పేరును వి.జానకిvs స్టేట్ ఆఫ్ కేరళగా మార్చాలని, కోర్టు సీన్లో ఒకచోట హీరోయిన్ పేరు మ్యూట్ చేయాలంది. మూవీ టీమ్ అభిప్రాయం తెలియజేయాలని కోర్టు కోరింది.