News July 10, 2025

ASF కలెక్టర్, ఎస్పీని కలిసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు

image

ASF జిల్లాలో ఇటీవల ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గ సభ్యులు బుధవారం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ఆయనతో పాటు సభ్యులు సదాశవ్, సంతోష్, మినేష్ తదితరులున్నారు.

Similar News

News July 10, 2025

VJA: సాగునీటి అవసరాలకు నీటి విడుదల

image

కృష్ణా డెల్టా రైతుల వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజీ నుంచి కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం రాత్రి నుంచి KEB కెనాల్ 1205 క్యూసెక్కులు, బందరు కెనాల్ 1,354 (క్యూ), ఏలూరు కెనాల్ 1216 (క్యూ), రైవస్ కెనాల్ 4001 (క్యూ), KE మెయిన్ 7764 (క్యూ), KW మెయిన్ 1216 (క్యూ), మొత్తం కాలువల ద్వారా 8,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

News July 10, 2025

పిల్లలు ఫోన్ చూస్తున్నారా?

image

దేశంలో 5 ఏళ్ల లోపు చిన్నారులు మొబైల్, TV చూసే విషయంలో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. WHO ప్రతిపాదనలను మించి రోజుకు 2.2 గంటలు స్క్రీన్ చూస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. దీనివల్ల స్కిల్స్ తగ్గుతాయని, ఊబకాయం పెరుగుతుందని, నిద్ర అలవాట్లు మారి ఆరోగ్యంపై పాడవుతుందని ఆ సర్వే హెచ్చరించింది. కాగా 2 ఏళ్లలోపు పిల్లలు అసలు స్క్రీన్ చూడొద్దని, 2-5 ఏళ్ల వారు రోజుకు గంట మాత్రమే చూడొచ్చని WHO చెబుతోంది.

News July 10, 2025

ఘట్‌కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

image

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్‌, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.