News July 10, 2025
HYD: స్వరూప మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలింపు

కల్తీకల్లు తాగి మృతి చెందిన స్వరూప మృతదేహాన్ని నిమ్స్ ఆసుపత్రి నుంచి స్వగ్రామానికి కుటుంబ సభ్యులు తరలిస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చరికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దాహన సంస్కారాలకు అన్ని సిద్ధం చేసుకుంటే అధికారులు ఇలా చేయడం ఏమిటి అని ప్రశ్నించారు. పోస్టుమార్టం నిమిత్తమై తరలించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News July 10, 2025
ఘట్కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.
News July 10, 2025
ఘట్కేసర్: కన్న తండ్రినే హతమార్చింది

ప్రియుడు, తల్లితో కలిసి కన్న తండ్రినే హతమార్చిన ఘటన ఘట్కేసర్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలిలా.. ముషీరాబాద్- ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం(45), శారద దంపతుల పెద్ద కుమార్తె భర్తతో విడిపోయి వీరి వద్దే ఉంటుంది. మనీషా వివాహేతర సంబంధంపై తండ్రి హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న మనీషా.. ఈనెల 5న ప్రియుడు మహ్మద్ జావీద్, తల్లితో కలిసి తండ్రిని చంపేసి శవాన్ని ఏదులాబాద్ చెరువులో పడేశారు.
News July 10, 2025
హుస్నాబాద్: బాత్రూంలో పడి గీతకార్మికుడు మృతి

అక్కన్నపేటకు చెందిన మాటూరి సదానందం బాత్రూంలో ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. ఎస్సై చాతరాజు ప్రశాంత్ వివరాలు.. గతనెల 19న తాటిచెట్టుపై నుంచి కాలుజారి పడిపోయిన సదానందం, WGLలోని ఆస్పత్రిలో చికిత్స పొంది ఈనెల 5న ఇంటికి వచ్చారు. బుధవారం ఇంట్లోని బాత్రూంలో కాలుజారి మళ్ళీ కిందపడ్డాడు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.