News July 10, 2025

అంబేడ్కర్ కోనసీమ: నేడు పీఎంటీఎం కార్యక్రమం

image

జిల్లాలోని అన్ని జూనియర్ స్కూళ్లు, కళాశాల్లో పీఎంటీఎం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఐఈఓ వనుము సోమశేఖరరావు బుధవారం తెలిపారు. పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఈ సమావేశంలో “మా తెలుగు తల్లికి మల్లెపూదండ” గేయాన్ని ఆలపించనున్నట్లు చెప్పారు. రంగవల్లులు, లెమన్ అండ్ స్పూన్ పోటీలు, తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

Similar News

News July 10, 2025

ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

image

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

News July 10, 2025

టీటీడీ తొలి ఈవో ఎవరంటే?

image

చెలికాని అన్నారావు 1933లో తిరుమల ఆలయ పేష్కారుగా చేరారు. 1949లో కమిషనర్‌గా, 1951 నుంచి 1964 వరకు TTD తొలి ఈవోగా పని చేశారు. 1974 నుంచి 1979 వరకు తొలి TTD ఛైర్మన్‌గా శ్రీవారి సేవలో తరించారు. రేడియోల్లో స్వామివారి సుప్రభాత ప్రసారం, ఘాట్ రోడ్డు‌లో దేవస్థానం బస్సు, TTD విద్యాసంస్థలు, లెప్రర్సీ ఆసుపత్రి, ఎంప్లాయిస్ బ్యాంకు ఏర్పాటు చేశారు. వీటికి గుర్తుగా 2007లో తిరుపతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

News July 10, 2025

తెలంగాణ లేకుండా చిత్రపటం బహూకరించారు: BRS MLC

image

ఏపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుర్తింపును తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని BRS MLC శ్రవణ్ ఆరోపించారు. మంత్రి లోకేశ్‌కు AP BJP చీఫ్ మాధవ్ తాజాగా భారతదేశ చిత్రపటాన్ని బహూకరించారు. ఇందులో TGని ప్రత్యేకంగా చూపకుండా ఉమ్మడి APని చూపించారని శ్రవణ్ మండిపడ్డారు. ‘ఇది TG గుర్తింపుపై AP నేతలు చేస్తున్న రాజకీయ కుట్రను సూచిస్తోంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని TG DGPని కోరారు.