News July 10, 2025
పార్వతీపురం జిల్లా రైతులకు ముఖ్య గమనిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంట భీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో బీమా పథకం అమలు జరుగుతుందని చెప్పారు. పత్తి, అరటి పంటల బీమా జూలై 15, మొక్కజొన్న పంటకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News July 10, 2025
టాస్ ఓడిన భారత్.. జట్టులోకి బుమ్రా

లార్డ్స్ వేదికగా టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమ్ ఇండియాలో ప్రసిద్ధ్ స్థానంలో బుమ్రా జట్టులోకి వచ్చారు. IND(XI): జైస్వాల్, రాహుల్, నాయర్, గిల్, పంత్(Wk), జడేజా, సుందర్, ఆకాశ్ దీప్, సిరాజ్, బుమ్రా, నితీశ్. ENG(XI): క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్(Wk), వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్.
News July 10, 2025
సమాజ భాగస్వామ్యంతోనే అభివృద్ధి: కలెక్టర్

సమాజ భాగస్వామ్యం ద్వారానే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. గురువారం అల్లవరం మండలం పేరూరులోని ఓ స్కూల్ను సందర్శించారు. అక్కడ జరుగుతున్న పీటీఎంను పరిశీలించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని ఆయన సూచించారు. విద్యాభివృద్ధిలో సమాజం కీలక భాగస్వామి కావాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఆకాంక్ష అని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
News July 10, 2025
WGL: మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి గురువారం వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు తరలివచ్చాయి. ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430 పలకగా.. పసుపు రూ. 12,259 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.5,800 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,600 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. .