News July 10, 2025
పార్వతీపురం జిల్లా రైతులకు ముఖ్య గమనిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంట భీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీఎం ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో బీమా పథకం అమలు జరుగుతుందని చెప్పారు. పత్తి, అరటి పంటల బీమా జూలై 15, మొక్కజొన్న పంటకు జూలై 31, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని కలెక్టర్ సూచించారు.
Similar News
News July 10, 2025
లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

లార్డ్స్లో భారత్తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్లను నితీశ్ కుమార్ పెవిలియన్కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
News July 10, 2025
రేపు నిర్మల్లో కాంగ్రెస్ మీటింగ్

నిర్మల్ మారుతి ఇన్ హోటల్లో శుక్రవారం కాంగ్రెస్ జిల్లా సమావేశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే నారాయణ్ రావు పటేల్ తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. సమావేశానికి స్థానిక సంస్థల ఎన్నికల ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ అనిల్కుమార్ యాదవ్, పీసీసీ జనరల్ సెక్రటరీ రాంభూపాల్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తలు మీటింగ్ను సక్సెస్ చేయాలని కోరారు.
News July 10, 2025
GHMCలో మీడియాపై ఆంక్షలు?

GHMC కార్యాలయాల్లోకి మీడియా ఎంట్రీని వారానికి ఒక్కరోజే అనుమతించాలని స్టాండింగ్ కమిటీ తీర్మానించినట్లు తెలుస్తోంది. ముందు పూర్తిగా నిషేధించాలని భావించినా, చర్చల అనంతరం ఒక్కరోజుకు వెసులుబాటు కల్పించింది. దీంతో GHMC, జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోకి మీడియాకు వారానికి ఒక్కరోజే అనుమతి ఉండనుంది. తమ విధులకు ఆటంకం కలగకుండా ఉండేందుకే దీనికి కారణంగా తెలుస్తోండగా.. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.