News July 10, 2025

టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం పీహెచ్‌సీని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టీబీ ముక్త్ భారత్ 100 రోజుల యాజిక్యంపై సమీక్షించారు. టీబీ కేసుల గుర్తింపు కోసం క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. డాక్టర్ ప్రణీత, ఫార్మాసిస్ట్ ప్రపుల్ల, ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్ తదితరులున్నారు.

Similar News

News July 10, 2025

HYDకు వేల లీటర్ల కల్లు ఎలా వస్తోంది?

image

ఒక తాటి చెట్టు నుంచి గరిష్ఠంగా 4- 5 లీటర్ల కల్లు రావటమే గగనం. కానీ.. HYDలోని అనేక కల్లు కాంపౌండ్లలో రోజూ వేల లీటర్ల కల్లు విక్రయయిస్తున్నారు. ఇదంతా తయారు చేసిందే అని తాగేవారే చెబుతున్నారు. దానికి వారు ఎడిక్ట్ అయ్యి. ఒరిజిన్ కల్లు ఇచ్చినా తీసుకోరు. చాలా చోట్ల నిషేదిత కెమికల్స్, తియ్యదనానికి శాక్రిన్ కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క బీర్ సీసా (650)లో కల్లు రూ.50 ధరతో విక్రయిస్తున్నారు.

News July 10, 2025

GWL: ‘కల్తీ’ కల్లోలం సృష్టించక ముందే మేల్కొందాం..!

image

HYDలో కల్తీకల్లు కల్లోలం సృష్టించింది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు. పాలమూరులో సైతం కల్తీకల్లు తాగి గతంలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. HYD ఘటనతో జిల్లాలో అధికారులు వీటిపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. 2023 సం. ప్రకారం ఉమ్మడి MBNRలో కల్లుగీత కార్మిక సహకార సంఘాల కల్లు డిపోల సంఖ్య 321గా ఉంది. 772 మందికి లైసెన్సులున్నాయి. 2020-23లో కల్తీ కారణంగా ఐదుగురు చనిపోగా, సుమారు 60 మంది అస్వస్థతకు గురయ్యారు.

News July 10, 2025

తెలుగు రాష్ట్రాల న్యూస్ రౌండప్

image

* రెండున్నర గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీ
* ఆగస్టు లోగా మెగా DSC పూర్తి చేస్తాం: లోకేశ్
* 20న నల్గొండ(D) దేవరకొండ పర్యటనకు CM రేవంత్
* Dy.CM పవన్ ఆదేశాలు.. విజయనగరం(D) దేవాడ మాంగనీస్ గనిలో అధికారుల తనిఖీలు
* కల్తీ కల్లు మృతుల కుటుంబాలకు రూ.20లక్షలివ్వాలి: KTR
* పుట్టపర్తి సత్యసాయి మహాసన్నిధిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు