News July 10, 2025
సంగారెడ్డి: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

నిరుద్యోగ ఎంబీసీ యువతీ, యువకులు వృత్తి నైపుణ్య శిక్షణ కోసం ఈ నెల 12లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్ బుధవారం తెలిపారు. దరఖాస్తులను https://tgobmms.cgg.gov.inలో సమర్పించాలని పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను డౌన్లోడ్ చేసి 14లోపు జిల్లా బీసీ అభివృద్ధి కార్యాలయంలో ఇవ్వాలన్నారు.
Similar News
News July 10, 2025
WGL: మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి గురువారం వివిధ రకాల చిరుధాన్యాల ఉత్పత్తులు తరలివచ్చాయి. ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు బిల్టీ క్వింటా రూ.2,430 పలకగా.. పసుపు రూ. 12,259 ధర పలికింది. అలాగే సూక పల్లికాయకి ధర రూ.5,800 రాగా.. పచ్చి పల్లికాయకి రూ.3,600 ధర వచ్చిందని అధికారులు తెలిపారు. .
News July 10, 2025
గాల్లో ఢీకొన్న విమానాలు.. ఇద్దరి మృతి

కెనడాలో విమానాలు ఢీకొన్న ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీకొనగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో భారత సంతతికి చెందిన శ్రీహరి సుకేశ్ (21)తో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. సుకేశ్ కేరళ వాసిగా తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కాన్సులేట్ జనరల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సుకేశ్ ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేసింది.
News July 10, 2025
సంగారెడ్డి: ‘విద్యార్థులను యాప్లో రిజిస్ట్రేషన్ చేయాలి’

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, మోడల్, కేజీబీవీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను డిఎస్ఈ ఎఫ్ఆర్ఎస్ యాప్లో రిజిస్ట్రేషన్ చేయాలనీ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఐఎస్, సిఆర్పీ, సిఓలతో జూమ్ సమావేశం నిర్వహించారు. డిఈఓ మాట్లాడుతూ.. ఈరోజు సాయంత్రం లోపల రిజిస్ట్రేసన్ పూర్తి చేయాలని తెలిపారు. పూర్తి చేయని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని సూచించారు.