News July 10, 2025
బుమ్రా, ఆర్చర్.. అంచనాలు అందుకుంటారా?

ఇవాళ భారత్- ఇంగ్లండ్ లార్డ్స్లో మూడో టెస్టులో తలపడనున్నాయి. అక్కడ పిచ్ బౌలింగ్కు అనుకూలించే ఛాన్స్ ఉంది. అందుకే బుమ్రా, ఆర్చర్పై ప్లేయర్లే కాదు.. అభిమానులు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. బుమ్రా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకుని మళ్లీ బరిలోకి దిగుతున్నారు. వీళ్లు రాణిస్తే బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. అయితే, ఎంత మేరకు అంచనాలు అందుకుంటారో చూడాలి.
Similar News
News July 10, 2025
తొలి క్వార్టర్: TCSకు రూ.12,760 కోట్ల లాభం

2025-26 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో భారత టెక్ దిగ్గజం TCS రూ.12,760 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసింది. గతేడాది ఇదే పీరియడ్(రూ.12,040 కోట్లు)తో పోలిస్తే లాభం 6 శాతం పెరిగింది. మరోవైపు ఆదాయం రూ.62,613 కోట్ల నుంచి రూ.63,437 కోట్లకు చేరింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 0.30% పెరిగి 24.5%కు ఎగిసింది. కాగా ఒక్కో షేరుకు రూ.11 చొప్పున మధ్యంతర డివిడెండ్ను కంపెనీ డిక్లేర్ చేసింది.
News July 10, 2025
జనగణన చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్

AP: రాష్ట్రంలో జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోనూ అదే రోజు ప్రక్రియ ప్రారంభం అవుతుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది.
News July 10, 2025
KCRకు వైద్య పరీక్షలు పూర్తి

TG: BRS అధినేత, మాజీ సీఎం KCRకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సోమాజిగూడ యశోద ఆస్పత్రి నుంచి నందినగర్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈనెల 3న ఆయన అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, సోడియం లెవల్స్ కొద్దిగా పెరిగాయని వైద్యులు నిర్ధారించారు. రెండు రోజుల చికిత్స అనంతరం 5వ తేదీన డిశ్చార్జ్ చేశారు. మరోసారి టెస్టుల కోసం రావాలని డాక్టర్లు సూచించడంతో ఇవాళ KCR ఆస్పత్రికి వెళ్లారు.