News July 10, 2025
KTDM: వైద్య విద్యార్థులకు అందని మెరుగైన విద్య.!

పాల్వంచ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడింట్స్, ట్యూటర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వైద్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని దుస్థితి. మొత్తం 196 ప్రధాన పోస్టులకు గానూ 108 ఖాళీలున్నాయి. కాలేజీకి సొంత భవనం లేకపోవడంతో నర్సింగ్ కళాశాలలో కొనసాగుతుంది. వీటిపై NMC అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసింది.
Similar News
News July 11, 2025
సంగారెడ్డి: ఈ తేదీల్లో సదరం శిబిరాలు

జులై నెలకు సంబంధించిన దివ్యాంగుల యూడీఐడీ (సదరం) ఈ నెల 16, 23, 30 తేదీల్లో క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవి గురువారం తెలిపారు. కావున జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే శిబిరానికి హాజరు కావాలని కోరారు.
News July 11, 2025
NZB: జనాభా నియంత్రణకు కృషి చేయండి: DM& HO

జనాభా నియంత్రణకు సిబ్బంది కృషి చేయాలని నిజామాబాద్ DM&HO డాక్టర్ బి.రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించే కార్యక్రమాలపై వివిధ PHCల వైద్యాధికారులతో గురువారం జిల్లాస్థాయి సన్నాక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో DM&HO మాట్లాడుతూ తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతుల పట్ల ప్రజల్లో అవగాహణ కల్పించాలని సూచించారు.
News July 11, 2025
కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.1,04,35,711

కొమురవెల్లి మల్లికార్జున స్వామి హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు గురువారం లెక్కించారు. స్వామి వారికి 55 రోజుల్లో రూ.1,04,35,711 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి అన్నపూర్ణ తెలిపారు. 120 గ్రాముల మిశ్రమ బంగారం, 6.100 కిలోల మిశ్రమ వెండి, 42 విదేశీ నోట్లు, మిశ్రమ బియ్యం 16 క్వింటాలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పోలీస్ సిబ్బంది, SBI బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.