News July 10, 2025
HYD: కల్లీ కల్లు ఘటనలో మృతుల వివరాలు.!

కూకట్పల్లిలో కల్తీ కల్లు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కూకట్పల్లిలో భాగ్యనగర్ కాలనీలోని కల్లు కాంపౌండ్, ఇంద్రహిల్స్లోని కల్లు కాంపౌండ్, హైదర్నగర్లో మరొక్క కల్లు కాంపౌండ్లో ఆదివారం తాగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిలో HMT హిల్స్కి చెందిన ఇద్దరు, హైదర్నగర్, శ్రీరామ్నగర్, మహంకాళి నగర్, సాయి చరణ్ కాలనీకి చెందిన వారు మృత్యువాత పడ్డారు. 30 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు.
Similar News
News July 11, 2025
HYD: అన్నా.. OUలో నోటిఫికేషన్ వస్తుందా?

‘అన్నా.. మన ఓయూలో డిగ్రీ, పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ను అధికారులు మరచిపోయినట్టున్నారు’ అని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. అంబేడ్కర్, IGNO వర్సిటీలు నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లు ప్రారంభించాయి. ఓయూ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయడంలేదు. ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
News July 11, 2025
GHMCకి మీడియాకు వారానికోసారి ఎంట్రీ?

జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News July 11, 2025
HYD: మాయం కానున్న ఆ మూడు పార్టీలు!

తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.