News July 10, 2025
టీటీడీ తొలి ఈవో ఎవరంటే?

చెలికాని అన్నారావు 1933లో తిరుమల ఆలయ పేష్కారుగా చేరారు. 1949లో కమిషనర్గా, 1951 నుంచి 1964 వరకు TTD తొలి ఈవోగా పని చేశారు. 1974 నుంచి 1979 వరకు తొలి TTD ఛైర్మన్గా శ్రీవారి సేవలో తరించారు. రేడియోల్లో స్వామివారి సుప్రభాత ప్రసారం, ఘాట్ రోడ్డులో దేవస్థానం బస్సు, TTD విద్యాసంస్థలు, లెప్రర్సీ ఆసుపత్రి, ఎంప్లాయిస్ బ్యాంకు ఏర్పాటు చేశారు. వీటికి గుర్తుగా 2007లో తిరుపతిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Similar News
News July 11, 2025
అరుదైన ఘనత.. వరుస ఓవర్లలో 2 హ్యాట్రిక్స్

ENG సఫోల్క్ కౌంటీకి చెందిన కిశోర్ కుమార్ సాధక్ అనే 37 ఏళ్ల స్పిన్నర్ రేర్ ఫీట్ సాధించారు. UKలోనీ టూ కౌంటీస్ ఛాంపియన్షిప్లో కెస్గ్రేవ్తో జరిగిన డివిజన్ మ్యాచ్లో వరుసగా 2ఓవర్లలో 2హ్యాట్రిక్స్ నమోదు చేశారు. ఇప్స్విచ్ & కోల్చెస్టర్ తరఫున బరిలోకి దిగిన సాధక్ 6 ఓవర్లేసి 20 రన్స్ ఇచ్చి ఆరుగురిని అవుట్ చేశారు. వారిలో ఐదుగురు డకౌట్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో సాధక్ జట్టు 7వికెట్ల తేడాతో గెలిచింది.
News July 11, 2025
రష్మిక విలన్ రోల్ చేస్తోందా?

అల్లు అర్జున్-అట్లీ మూవీలో రష్మిక నటిస్తారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో ఐదుగురు హీరోయిన్లని, అందులో రష్మిక ఒకరని సినీటౌన్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే దీపికను హీరోయిన్గా పరిచయం చేశారు. మృణాల్ కూడా షూటింగ్లో పాల్గొన్నారని చెబుతున్నారు. మిగిలిన 3 పాత్రల్లో రష్మిక, జాన్వీ, భాగ్యశ్రీ పేర్లు వినిపిస్తున్నాయి. రష్మిక పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని, యాక్షన్ సీన్సూ చేస్తారని సమాచారం.
News July 11, 2025
NZB: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

నిజామాబాద్ మూడవ టౌన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు SI హరిబాబు గురువారం తెలిపారు. పంబౌలి ఏరియాలో గంజాయి విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అఫ్రోజ్, షేక్ అయాజ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరు నుంచి 238 గ్రాముల గంజాయిని స్వాధీన పరుచుకొని, రిమాండ్కు తరలించారు.