News July 10, 2025
జమ్మికుంట: గంజాయి విక్రయం.. నలుగురి అరెస్టు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఎఫ్సీఐ సమీపంలో నిషేధిత గంజాయి అమ్మేందుకు వచ్చిన నలుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు హుజురాబాద్ ఏసీపీ మాధవి తెలిపారు. జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. రెండు బైకులపై వచ్చిన నలుగురు యువకులను పట్టుకుని విచారించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.
Similar News
News July 11, 2025
కరీంనగర్: PET పోస్టుకు దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్

కరీంనగర్ జిల్లా KGBVలోని ఖాళీ పీఈటీ పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిన దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా విద్యాధికారి శ్రీరాం మొండయ్య గురువారం తెలిపారు. 2023లో అర్హత పొందిన వారిని ఎంపిక చేస్తామన్నారు. వారిని ఫోన్ లేదా మెసేజ్ ద్వారా పిలుస్తామని, వివరాలను www.karimnagardeo.com వెబ్సైట్లో పెడతామని, సంబంధిత అభ్యర్థులు తగు సర్టిఫికేట్లు, 3 ఫొటోలతో ఈనెల 11న జిల్లా విద్యా శాఖ ఆఫీస్లో హజరుకావాలన్నారు.
News July 9, 2025
కరీంనగర్: ‘తక్షణమే హార్డ్ కాపీలు పంపాలి’

కరీంనంగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల e-pass లాగిన్లలో పెండింగ్లో ఉన్న యుటిలైజేషన్ సర్టిఫికెట్లు తాజా, పునరుద్ధరణ ఉపకారవేతన దరఖాస్తులను (Fresh/Renewal Scholarship Applications) తక్షణమే వెరిఫై చేయాలని DTDO సంగీత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటి హార్డ్ కాపీలను జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయానికి తక్షణమే సమర్పించలన్నారు. సందేహాల నివృత్తికి 9502664044కు కాల్ చేయాలని కోరారు.
News July 9, 2025
KNR: భార్య దూషించందని భర్త సూసైడ్

కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తిచెంది పురుగుమందు తాగి వ్యక్తి మృతిచెందిన ఘటన వీణవంక మండలం కోర్కల్లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. నిమ్మల రాజు భార్య రజితతో కొంతకాలంగా అలుగునూరులో కూలీపని చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండగా రజిత రాజును తీవ్రంగా దూషించింది. మనస్తాపం చెందిన భర్త పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు SI తిరుపతి తెలిపారు.