News July 10, 2025
నంద్యాల జిల్లాలో 3.14 లక్షల మంది: కలెక్టర్

నంద్యాల జిల్లాలోని 1,959 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 3.14 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్ రాజకుమారి తెలిపారు. వెలుగోడులో ఆమె మాట్లాడుతూ.. మన ఎదుగుదలను కోరుకునేది మన గురువులేనన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాలన్నారు.
Similar News
News July 11, 2025
KMR జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. పలుచోట్ల వర్షపాతం కురవగా, జిల్లాలో వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్నది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు మద్నూర్ మండలం సోమూరు లో 3.8మి.మీ, డోంగ్లి 1.5మి.మీ, పల్వంచ మండలం ఇసాయిపేటలో 0.8మి.మీ, నస్రుల్లాబాద్ 0.5మి.మీ లుగా నమోదయింది.
News July 11, 2025
విజయవాడ: యజమానిని చంపి పనిమనిషి పరార్

విజయవాడలో శుక్రవారం తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీలో వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో కలిసి అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని హతమార్చి ఇంటిలో ఉన్న బంగారంతో పారిపోయిందని పోలీసులు తెలిపారు.
News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.