News July 10, 2025
HYDకు వేల లీటర్ల కల్లు ఎలా వస్తోంది?

ఒక తాటి చెట్టు నుంచి గరిష్ఠంగా 4- 5 లీటర్ల కల్లు రావటమే గగనం. కానీ.. HYDలోని అనేక కల్లు కాంపౌండ్లలో రోజూ వేల లీటర్ల కల్లు విక్రయయిస్తున్నారు. ఇదంతా తయారు చేసిందే అని తాగేవారే చెబుతున్నారు. దానికి వారు ఎడిక్ట్ అయ్యి. ఒరిజిన్ కల్లు ఇచ్చినా తీసుకోరు. చాలా చోట్ల నిషేదిత కెమికల్స్, తియ్యదనానికి శాక్రిన్ కలుపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క బీర్ సీసా (650)లో కల్లు రూ.50 ధరతో విక్రయిస్తున్నారు.
Similar News
News July 11, 2025
శ్రీశైలం నీళ్లు ఎలా వాడుకుంటారో తెలుసా?

శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ నుంచి రాయలసీమ, తెలంగాణకు నీరందుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కులను రాయలసీమకు తరలించొచ్చు. తెలుగు గంగ, గాలేరు-నగరి కాలువల ద్వారా కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలకు నీరందుతోంది. హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకంతో అనంతపురం, చిత్తూరుకు నీరు వెళ్తోంది. అటు తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా లబ్ధి పొందుతోంది.
News July 11, 2025
VJA: విచ్చలవిడిగా రూ.35 కోట్ల దుబారా..చివరికి.!

అద్విక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్య కేసు దర్యాప్తులో పోలీసులు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెస్తున్నారు. డిపాజిటర్లను ఆకర్షించేందుకు రూ.35 కోట్లకుపైగా పలు ఉత్సవాలు, పుట్టినరోజు వేడుకలు, ఖరీదైన హోటల్ రూమ్లలో బస ఏర్పాట్లు, టూర్లను కంపెనీ నిర్వాహకులు చేపట్టినట్లు తెలుస్తోంది. 11 మంది కంపెనీ డైరెక్టర్లకు విల్లాలు కట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయగా దివాళా తీయడంతో ముందుకెళ్లలేదు.
News July 11, 2025
BJP రామచంద్రా.. భద్రాద్రిని కాపాడండి: కేటీఆర్

AP రాష్ట్రం పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాచలం రాములోరి భూములను ఆక్రమించుకుంటుంటే BJP రామచంద్రా నోరు తెరవరేం అని BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును మాజీ మంత్రి కేటీఆర్ పరోక్షంగా విమర్శించారు. తమ భాగస్వామ్య ప్రభుత్వం చేరలో ఉన్నామని వదిలేస్తున్నారా అని మండిపడ్డారు. ప్రధాని మోదీతో మాట్లాడతారో లేదా మీ దోస్తు(చంద్రబాబు నాయుడు) దగ్గర మోకరిల్లుతారో మీ ఇష్టం.. ఆక్రమణల చెర నుంచి విడిపించాలని డిమాండ్ చేశారు.