News July 10, 2025
BREAKING: సిరిసిల్ల: నిరుద్యోగి ఆత్మహత్య

ఉద్యోగం రావడంలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో ఈరోజు చోటుచేసుకుంది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన లోకం శ్రీకాంత్(25) ఉన్నత చదువులు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిరాశ చెందాడు. గురువారం గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. తల్లి మణెమ్మ ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News July 11, 2025
KMR జిల్లాలో పలుచోట్ల వర్షపాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. పలుచోట్ల వర్షపాతం కురవగా, జిల్లాలో వాతావరణం సాధారణ స్థితికి చేరుకున్నది. జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు మద్నూర్ మండలం సోమూరు లో 3.8మి.మీ, డోంగ్లి 1.5మి.మీ, పల్వంచ మండలం ఇసాయిపేటలో 0.8మి.మీ, నస్రుల్లాబాద్ 0.5మి.మీ లుగా నమోదయింది.
News July 11, 2025
విజయవాడ: యజమానిని చంపి పనిమనిషి పరార్

విజయవాడలో శుక్రవారం తెల్లవారు జామున దారుణం చోటు చేసుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని NTR కాలనీలో వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసుకునేందుకు 3 రోజుల క్రితం అనూష అనే పని మనిషిని పెట్టుకున్నారు. ఆమె కూడా వారితో కలిసి అక్కడే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటి యజమానిని హతమార్చి ఇంటిలో ఉన్న బంగారంతో పారిపోయిందని పోలీసులు తెలిపారు.
News July 11, 2025
GNT: చంద్రబాబు, లోకేశ్పై అంబటి ట్వీట్

వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ట్విటర్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కి చురకలంటించారు. ‘తల్లికి వందనం’ లోకేశ్ ఆలోచన. ‘ఉచిత విద్యుత్’ బాబు ఆలోచన అని చెప్తూ అమాయకపు ప్రజల్లారా నమ్మండి.!’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా అంబటి మెసేజ్పై టీడీపీ, వైసీపీ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో పరస్పరం మాటల యుద్దం జరుగుతుంది.