News July 10, 2025
BREAKING: పంత్కు గాయం

ఇంగ్లండ్తో మూడో టెస్ట్ సందర్భంగా భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. కీపింగ్ చేస్తుండగా బంతి అతడి వేలుకి బలంగా తాకింది. దీంతో ఫిజియో వచ్చి పంత్ వేలికి ట్రీట్మెంట్ చేసినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తున్నారు. గాయం పెద్దదై పంత్ బ్యాటింగ్ చేయలేకపోతే టీమ్ ఇండియాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
Similar News
News August 15, 2025
దసరా సెలవులు ఎప్పటి నుంచంటే?

తెలుగు రాష్ట్రాల్లో సెప్టెంబర్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఏపీ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు. క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఉండనున్నాయి. అటు తెలంగాణలో సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు సెలవులు ఇచ్చారు. అలాగే TGలో సెప్టెంబర్ 5న మిలాద్ ఉన్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలిడే ఉంది.
News August 15, 2025
GST శ్లాబ్స్ 5 నుంచి 2కి తగ్గింపు?

ప్రస్తుతం <<17409983>>GST<<>>లో 5 శ్లాబ్స్ (0%, 5%, 12%, 18%, 28%) ఉండగా కేంద్రం వాటిని 2కి (5%, 18%) తగ్గించనున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. లగ్జరీ, సమాజానికి హాని చేసే పొగాకు, పాన్ మసాలా లాంటి ఐటమ్స్ను ప్రత్యేకంగా 40% జీఎస్టీలోకి తెచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 12% శ్లాబ్లో ఉన్న 99 శాతం వస్తువులను 5% శ్లాబ్లోకి, 28% శ్లాబ్లో ఉన్న 90 శాతం వస్తువులను 18% శ్లాబ్లోకి మార్చే ఛాన్స్ ఉంది.
News August 15, 2025
రేపు భారీ వర్షాలు: APSDMA

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలు కురిసే ఆస్కారముందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన పడొచ్చని పేర్కొంది. అటు, కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సా.5 గంటలకు 2,98,209 క్యూసెక్కులుగా ఉందని వెల్లడించింది.