News July 10, 2025

జగిత్యాల: అడ్రస్ మారినా అప్‌డేట్ చేయని అధికారులు

image

జగిత్యాల ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. దాదాపుగా రెండేళ్ల క్రితమే జగిత్యాల జిల్లా ఆర్టీఏ కార్యాలయం తాటిపల్లి గ్రామానికి తరలించగా, ప్రస్తుతం స్లాట్ బుక్ చేసుకుంటున్న వారికి డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ ధరూర్ క్యాంపు అని చూపించడంతో అవాక్కవుతున్నారు. ఆర్టీఏ కార్యాలయం, డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ మారినా వెబ్‌సైట్‌లో ఇంకా అడ్రస్ అప్‌డేట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Similar News

News July 11, 2025

GNT: రాష్ట్రీయ బాల పురస్కార్‌కు ప్రతిభావంతులకు అవకాశం

image

విభిన్న ప్రతిభను ప్రోత్సహించేందుకు గుంటూరు జిల్లాలోని 18ఏళ్ల లోపు విద్యార్థుల నుంచి రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కళలు, క్రీడలు, పర్యావరణం, సామాజిక సేవ, తదితర రంగాల్లో సామర్థ్యం చూపిన పిల్లలు జులై 31లోగా https://awards.gov.inలో అప్లై చేయాలని జిల్లా శిశు సంక్షేమ అధికారి ప్రసూన తెలిపారు. కేంద్రం నిర్వహించే ఈ అవార్డు ప్రతిభకు గుర్తింపు కల్పించనుందన్నారు.

News July 11, 2025

మేడ్చల్: ‘రేషన్ కార్డులకు E-KYC పూర్తి చేయాలి’

image

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

NLG: వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ కలకలం

image

ఉమ్మడి నల్గొండలో ఫోన్ ట్యాపింగ్ రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. DCMS మాజీ ఛైర్మన్ వట్టె జానయ్య ఫోన్ ట్యాపింగ్ అయిందని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈనెల 14న విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆయనకు నోటీసులు ఇచ్చారు. గతంలో జిల్లాలో పలువురు నేతల ఫోన్లు ట్యాప్ అయినట్లు ఆరోపణలు వచ్చినా, ఇది అధికారులిచ్చిన తొలి నోటీసు కావడం గమనార్హం. జిల్లాలో ఇంకెంత మంది నేతలు ట్యాపింగ్ బారిన పడ్డారో తెలియాల్సి ఉంది.