News March 30, 2024

తూ.గో.: 9 మంది వాలంటీర్ల రాజీనామా

image

తూ.గో. జిల్లా కడియం మండలంలో 9 మంది గ్రామ వాలంటీర్లు వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు కడియం ఎంపీడీవో జి.రాజ్ మనోజ్ శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. వీరిలో ఏడుగురు కడియం, మిగిలిన ఇద్దరు కడియపులంక గ్రామానికి చెందిన వారు ఉన్నారన్నారు. వ్యక్తిగత కారణాలవల్ల రాజీనామా చేసినట్లు వారు చెప్పారని ఎంపీడీవో తెలిపారు.

Similar News

News January 11, 2026

ఖేలో ఇండియాలో ఏపీకి రజతం.. దేవరపల్లి క్రీడాకారుల ప్రతిభ!

image

గుజరాత్‌లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్‌లో ఏపీ సెపక్ తక్రా జట్టు రెండోస్థానం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో బీహార్‌పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏపీ జట్టులో ప్రతిభచాటిన దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిలను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

News January 11, 2026

రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

image

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.

News January 11, 2026

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ

image

సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, పేకాట తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నర్సింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందాలకు ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని, కోడి కత్తుల తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీస్ నిబంధనలు అతిక్రమించరాదంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.